YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఆలయమా..వైకాపా కార్యాలయమా

ఆలయమా..వైకాపా కార్యాలయమా

విజయవాడ దుర్గాదేవి ఆలయమా  వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయమా ?  ఆలయ ప్రాంగణంలో ఉన్న మంత్రి క్యాంపు కార్యాలయంలో రాజకీయ సమావేశాలా అని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్ మండిపడ్డారు. ఈవో సురేష్ బాబు రాజీనామా చేసి వైయస్సార్ సిపి పార్టీ సభ్యత్వం తీసుకోవాలని అయన అన్నారు.
కరోనా లాక్డౌన్ నాటి నుంచి నిన్నటి సమావేశం వరకు అమ్మవారి ప్రసాదాల కుంభ కోణాలే. వైఎస్సార్సీపీ నాయకులు కి కార్పొరేటర్ అభ్యర్థులకు దోచి పెడుతున్నారు.  ఆలయంలో జరుగుతున్న వరుస సంఘటనపై భక్తుల మనోభావాలు  దెబ్బతింటున్నాయి.  ఆలయ ప్రతిష్టను పెంచడానికా లేక  దిగజార్చడానికా  చైర్మన్ పదవి సోమి నాయుడని అయన ప్రశ్నించారు. అవినీతి మీద ఎలాగో స్పందించరు. ఆలయ సాంప్రదాయాలును మీ పార్టీ నేతలు   మంటగలుపుతున్నా  స్పందించరా సీఎం అని అయన అన్నారు.

Related Posts