YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం తెలంగాణ

మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ లో చేరిన బీజేపీ నాయకులు

మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ లో చేరిన బీజేపీ నాయకులు

నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రానికి చెందిన  బీజేపీ సీనియర్ నాయకులు అర్కరి కిషన్,ధర్మాయి రాజేందర్,పలువురు రైతు నాయకులు మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు

బద్దం ప్రవీణ్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో శుక్రవారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి కేసీఆర్,మంత్రి ప్రశాంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులు

చూసి,కేసీఆర్ ప్రభుత్వం రైతు,పేదల కోసం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు వారు తెలిపారు.

మంత్రి ప్రశాంత్ రెడ్డి వారికి గులాబీ కండువా కప్పి

పార్టీలోకి ఆహ్వానించారు.

క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయడమే కాకుండా, టీఆర్ఎస్ సర్కార్ అమలు చేస్తున్న పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.రైతు

సంక్షేమమే ద్యేయంగా కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.ప్రతీ కార్యకర్తకు భరోసా కల్పించే ఏకైక పార్టీ టీఆర్ఎస్ అని మంత్రి అన్నారు.

ఈ కార్యక్రమంలో కేసీఆర్ రాజకీయ

కార్యదర్శి,ఎమ్మెల్సీ శేరి శుభాష్ రెడ్డి,బాల్కొండ నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు దాసరి వెంకటేష్,తౌట్ గంగాధర్,టీఆర్ఎస్ నాయకులు లింగాగౌడ్,వైస్ ఎంపీపీ శ్రీకాంత్ యాదవ్,

వేల్పూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వేంపల్లి చిన్న బాల్ రాజేశ్వర్,మండల ప్రధాన కార్యదర్శి పుప్పాల విద్యా సాగర్,టౌన్ ప్రెసిడెంట్ సాగర్ యాదవ్,ఉపసర్పంచి షేక్ వాహబ్,మండల

కో-ఆప్షన్ సభ్యులు సయ్యద్ ఫయాజ్,సొసైటీ డైరెక్టర్ డాక్టర్ ప్రసాద్ గౌడ్,రైతు బంధు సమితి గ్రామ కో-ఆర్డినేటర్ కన్న పోశెట్టి,వేల్పూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సయ్యద్ మాజారోద్దీన్,మాజీ కో

ఆప్షన్ సభ్యులు  షాహిద్,బూస నరహరి తదితరులు పాల్గొన్నారు.

Related Posts