YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం తెలంగాణ

మంత్రి ఈటల సుడిగాలి పర్యటన

మంత్రి ఈటల సుడిగాలి పర్యటన

కమలాపూర్ మండలం భీంపల్లి, కన్నూరు, గుండెడు, వంగపల్లి, దేశ రాజు పల్లి గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను  రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ శనివారం ప్రారంభించారు. దేశంలో కరోనా వచ్చి ఎన్ని రకాల ఇబ్బందులు ఉన్నా చెక్కు చెదరకుండా మళ్ళీ ఆర్థికంగా  నిలదొక్కుకున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ.  గత నాయకుల మాదిరిగా కాకుండా గ్రామాలు బాగు పడాలి. మా రైతుల బతుకులు బాగు పడాలి. తెలంగాణ దేశ చిత్ర పఠం మీద గొప్పగా నిలబడాలి అనే ఎజెండాతో వున్నామని అన్నారు.  రైతాంగానికి ఈ సంవత్సరం ఒక బస్తా కూడా నల్లగా ఉంది. మొలక వచ్చిందని రిజెక్ట్ చేయవద్దు. ప్రతి గింజ కూడా కొనాల్సిందే. రైతులు తెచ్చిన ధాన్యాన్ని మిల్లులలో ఆలస్యం చేయకుండా దిగుమతి చేసుకోవాలని అయన అన్నారు. ఎక్కడ ఇబ్బందులు లేకుండా రైతు సమన్వయ సంఘాలు అధికారులు ప్రజా ప్రతి నిధులు నెల రోజుల పాటు సహకారంతో పని చేసుకోవాలని మంత్రి అన్నారు..        

Related Posts