YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ప్రత్తిపాడులో వైకాపా ర్యాలీ

ప్రత్తిపాడులో వైకాపా ర్యాలీ

రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి అవిరళ కృషి చేస్తూ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఆశీర్వదించాలని కాకినాడ ఎంపీ వంగా గీత, ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత శ్రీ పూర్ణ చంద్ర ప్రసాద్ లు కోరారు. సీఎం జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర నిర్వహించి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రత్తిపాడు నియోజకవర్గంలో ప్రజలతో నాడు- ప్రజల కోసం నేడు కార్యక్రమంలో భాగంగా వారు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో  ప్రజలనుద్దేశించి ఎంపీ గీత, ఎమ్మెల్యే ప్రసాదులు ప్రసంగించారు. వైసిపి నాయకులు జువ్వల కొండల రావు, మారిశెట్టి శివకుమార్, మాజీ జడ్పీటీసీలు ఎస్. వెంకటేశ్వరరావు, ఈగల అప్పారావు, డిసిసిబి డైరెక్టర్ శెట్టిబత్తుల కుమార్ రాజా, శ వైసీపీ మండల కన్వీనర్ బెహరా దొరబాబు తదితరులు పాల్గొన్నారు.

Related Posts