YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వైకాపా తీర్థం పుచ్చుకున్న టిడిపి నాయకులు షేక్ ఖాజావలి

వైకాపా తీర్థం పుచ్చుకున్న టిడిపి నాయకులు షేక్ ఖాజావలి

నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని సౌత్ మోపూరు టీ.డీ.పీ గ్రామ కమిటీ అధ్యక్షులు షేక్ ఖాజావల్లి, మిత్ర బృందం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంచార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి గౌరవం కల్పిస్తాం అని భరోసా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేతున్న సంక్షేమ పధకాలు,  రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి  అభివృద్ధి కార్యక్రమాలకి ఆకర్షితులై ,నెల్లూరు రూరల్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు అని తన అభిప్రాయాన్ని వెల్లడించారు . కొత్త పాతల కలయిక తో నెల్లూరు గ్రామీణ నియోజవర్గ లో వైకాపాను బలోపేతం చేయడమే లక్ష్యంగా చేరికల కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా విజయపథాన నడిచేందుకు ప్రతి ఒక్కరూ ఐక్యత గా కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పార్టీలో నూతనంగా చేరిన ఖాజావలి అతని మిత్రబృందానికి వైకాపా కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైకాపా నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts