YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

నేరాలు ఆంధ్ర ప్రదేశ్

వైజాగ్ యువతి హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్

వైజాగ్ యువతి హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్

వైజాగ్ యువతి హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. మరో ఇద్దరు నిందితులను గాజువాక పోలీసులు అరెస్టు చేశారు. ప్రేమోన్మాది అఖిల్ సాయి వెంకట్ ఇంటర్ విద్యార్థిని గొంతుకోసి కిరాతకంగా హతమార్చిన విషయం తెలిసిందే. ఆమె తనతో కాకుండా మరొకరితో చనువుగా ఉంటుందన్న కోపంతో హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. ఈ కేసు సీరియస్‌గా తీసుకున్న పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టారు.హత్యకు గురైన యువతి వంగపండు రామునాయుడు అనే యువకుడితో చనువుగా ఉంటోందని తెలిసి ఆమె సోదరుడు అతనితో గొడవపడినట్లు తెలుస్తోంది. మరోసారి ఇలా జరిగితే మర్యాదగా ఉండదని హెచ్చరించినట్లు సమాచారం. అంతటితో ఆగకుండా రెండేళ్ల కిందట హత్యకు గురైన రౌడీ షీటర్ కుమారుడు హరి రామకృష్ణరాజు అలియాస్ హరికి విషయం చెప్పినట్లు తెలుస్తోంది. అతను రాముకి ఫోన్ చేసి రూ.10 వేలు డిమాండ్ చేసినట్లు సమాచారం.తనకు డబ్బులిస్తే ఏ గొడవ లేకుండా చూసుకుంటానని చెప్పడంతో రాము పలు దఫాలుగా రూ. వేలు పంపించినట్లు తెలుస్తోంది. హరి స్నేహితుడు తంగెళ్ల చిన్న అప్పన్న కూడా రాము వద్ద వెయ్యి రూపాయలు తీసుకున్నట్లు సమాచారం. కేసు విచారణలో భాగంగా రాముని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో ఆ ఇద్దరి పేర్లు చెప్పినట్లు తెలుస్తోంది. వెంటనే పోలీసులు హరి, అప్పన్నని అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటికి ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు గాజువాక సీఐ తెలిపారు.

Related Posts