YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ర్యాడా మహేష్ కు మంత్రి వేముల నివాళి

ర్యాడా మహేష్ కు మంత్రి వేముల నివాళి

జమ్మూకాశ్మీర్ మచిల్  కుపువారలో ఉగ్రదాడిలో వీరమరణం పొందిన నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం కోమన్పల్లి గ్రామానికి చెందిన ర్యాడా మహేష్ కు రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఘన నివాళులర్పించారు. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన మహేష్ చిన్న తనం నుంచే అమితమైన దేశభక్తి...  దేశం మీద ప్రేమతో సైన్యం లో చేరి భారతావని కోసం నీవు చేసిన త్యాగం మరువలేనిది. భౌతికంగా మానుండి దూరమైన బాధ ఉన్నా...దేశం కోసం ప్రాణాలర్పించడం స్ఫూర్తి దాయకమని అన్నారు. వీర సైనికుడా యావత్తు తెలంగాణ నీకు నివాళి అర్పిస్తుంది. మహేష్ త్యాగం వెలకట్టలేనిదైనా...రాష్ట్ర ప్రభుత్వం తరుపున మహేష్ కుటుంబానికి ముఖ్యమంత్రి కేసీఆర్,   వేల్పూర్ వాసిగా నేను అండగా ఉంటామని అన్నారు. మహేష్ తో పాటు వీరమరణం పొందిన సైనికులకు నా జోహార్లు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. వారికి ఆ భగవంతుడు మనోధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నాని అన్నారు.  వీర జవాన్ల పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని మంత్రి అన్నారు.

Related Posts