YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం తెలంగాణ

రైతులను మోసం చేస్తున్న కేసీఆర్ వ్యవసాయ విధానాలు: పొన్నం

రైతులను మోసం చేస్తున్న కేసీఆర్ వ్యవసాయ విధానాలు: పొన్నం

కేంద్ర, రాష్ట్ర రైతాంగ విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సంతకాల సేకరణ కు రైతుల నుంచి అనూహ్య స్పందన  లభిస్తుందని     టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు పొన్నం ప్రభాకర్ అన్నారు.కేంద్రం ఇటీవల తెచ్చిన వ్యవసాయ చట్టాలు రైతాంగ సంక్షేమానికి వ్యతిరేకంగా, వ్యవసాయాన్ని సంక్షోభంలో పెట్టె విదంగా ఉన్నాయని, రాష్ట్రంలో కేసీఆర్ వ్యవసాయ విధానాలు రైతులను మభ్యపెడుతున్నాయని, మోసం చేస్తున్నాయని పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఈ విషయమై ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ఈ విషయంలో ఏఐసీసీ దేశవ్యాప్తంగా 2 కోట్ల మంది రైతులతో సంతకాల సేకరణ చేయాలని అందులో భాగంగా తెలంగాణలో 12 లక్షల మంది రైతులతో సంతకాల సేకరణ చేయాలని లక్ష్యం గా మండలాల్లో సంతకాల సేకరణ చేస్తున్నామని 3 వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఈ సంతకాల సేకరణ చేపట్టామని ఆయన వివరించారు. ఇప్పటికే 12 లక్షల సంతకాల సేకరణ దాటి పోయిందని దాదాపు 15 లక్షల సంతకాల వరకు సేకరణ అయ్యే అవకాశం ఉందని అన్నారు.ప్రతి నియోజక వర్గ బాధ్యులు, జిల్లాల బాధ్యులు, ముఖ్య నాయకులు క్షేత్ర స్థాయిలో రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి వారికి రైతు వ్యతిరేక చట్టాలపై అవగాహన కల్పించారని వివరించారు.
రేపటితో సంతకాల సేకరణ ముగుస్తుందని పీసీసీ అధ్యక్షులు, కార్య నిర్వాహక అధ్యక్షులు, ఎంపీ లు, ఎమ్యెల్యేలు, ఎంఎల్సీ, ఏఐసీసీ కార్యదర్శులు, కార్య నిర్వాహక అధ్యక్షులు, ఏఐసీసీ నాయకులు, మాజీ మంత్రులు, నియోజక వర్గ బాధ్యులు ఈ కార్యక్రమంలో క్రియాశీలకంగా పని చేసారని ఆయన పేర్కొన్నారు..

Related Posts