YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

లాం కుటుంబ సభ్యుల ఆత్మహత్యకు ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలి - ప్రతిపక్ష నేత, నారా చంద్రబాబు నాయుడు డిమాండ్

లాం కుటుంబ సభ్యుల ఆత్మహత్యకు ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలి - ప్రతిపక్ష నేత, నారా చంద్రబాబు నాయుడు డిమాండ్

సలాం కుటుంబ సభ్యుల ఆత్మహత్యకు ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలనిటీడీపీ జాతీయ అధ్యక్షులు, శాసనసభ ప్రధాన ప్రతిపక్ష నేత, నారా చంద్రబాబు నాయుడు డిమాండ్ చేసారు.అబ్దుల్ సలాం, నూర్జహాన్ దంపతులు పిల్లలతో సహా రైలుకింద పడి ఆత్మహత్య చేసుకుని మరణించడం విచారకరం. ముస్లింలను వేధింపులకు గురిచేస్తూ, అక్రమ కేసులు పెడుతున్నారు అనేందుకు సలాం కుటుంబం ఆత్మహత్యే నిదర్శనం.నాడు శాసనమండలిలో సభ్యులందరిముందు చైర్మన్ షరీఫ్ నుమతం పేరుతో దూషించారని,రాజమండ్రిలో పదేళ్ళ ముస్లిం బాలికపై అత్యాచారయత్నం చేసిన వారిపై కేసు పెడితే.. కేసు వెనక్కు తీసుకోవాలని వైసీపీ నేతలు బాలిక తండ్రి సత్తార్ గారిపై ఒత్తిడి తేవడంతో ఆయన ఆత్మహత్య వరకు వెళ్ళారన్నారు. చెయ్యని నేరాన్ని ఒప్పుకోమని అధికారులు వేధించడంతో ఒక నిండు కుటుంబం బలైపోయిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేసారు.రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయి అంటున్న ప్రభుత్వం...  దీనికి ఏమని సమాధానం చెప్తుందని ప్రశ్నించారు. నంద్యాల ఘటను తీవ్రంగా ఖంసించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని, ముస్లిం మైనారిటీల పట్ల ప్రభుత్వం తన నిర్లక్ష్య వైఖరి వీడాలని డిమాండ్ చేసారు.

Related Posts