YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

నేరాలు ఆంధ్ర ప్రదేశ్

ప్రియుడికోసం కొడుకునే చంపాలనుకున్న తల్లి

ప్రియుడికోసం కొడుకునే చంపాలనుకున్న తల్లి

తన వివాహేతర సంబంధానికి అడ్డాస్తున్నాడని భావించిన ఓ తల్లి తన ప్రియుడితో కలసి ఐదేళ్ల కుమారుడిని హతమార్చడానికి యత్నించిన సంఘటన అనంతపురం జిల్లా

డీ.హీరేహాళ్ మండలం ఓబుళాపురం గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చిత్రదుర్గం జిల్లా చెల్లికెర తాలూకా మరెమ్మనహళ్లి గ్రామంలో మల్లిఖార్జున, శృతి నివాసముంటున్నారు. వీరికి కుమారుడు దినేష్ (5) ఉన్నాడు. శృతికి డీ.హీరేహాళ్ మండలం ఓబుళాపురం గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ శివ తో వివాహేతర సంబంధం ఉంది. దీంతో అతని మాటలు నమ్మి ఆమె తన కుమారుడితో కలిసి పది రోజుల క్రితం ఓబుళాపురానికి వచ్చింది. అక్కడ కన్నడ పాఠశాల సమీపంలోని ఊరి చివరిలో ఒక ఇంటిని బాడుగకు తీసు కుని ఉంటోంది. దినేష్ అక్కడి పిల్లలతో కలిసి ఆడుకునేవాడు. ఆదివారం దినేష్ కోసం కొందరు పిల్లలు అతని ఇంటికి వెళ్లారు. ఇంట్లో దినేష్ నోటిలో గుడ్డలు కుక్కి.. చేతులు వెనక్కు కట్టేసి ఉండటాన్ని గమనించి పరుగున వెళ్లి తమ తల్లిదండ్రులకు విషయం చెప్పారు. వారు వెళ్లి ఆ పిల్లాడిని విడిపించారు. ఆ పిల్లాడి కాళ్లకు, శరీరంపైన వాతలు, ఎడమ చేతిని విరగొట్టి ఉండ టాన్ని గమనించారు. వెంటనే ఆ బాలుడిని ఆసుపత్రికి తరలించారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఆమెను అదు పులోకి తీసుకున్నారు. తాము పెళ్లి చేసుకొని ఉండాలనే ఉద్దేశంతో అడ్డుగా ఉన్న దినేష్ ను చంపబోయామని శృతి, శివ ఒప్పుకున్నారు ఆదివారం రాత్రి వారిని పోలీసులు బెయిల్ పై పంపించారు. దినేష్ తన తల్లి దగ్గరకు వెళ్లడానికి భయపడు తుండటంతో.. ప్రస్తుతం వారికి పరిచయం ఉన్న వారి ఇంటిలో ఉంచారు.

Related Posts