సొంత అన్నల మేనమామల పేద ప్రజలను సీఎం కెసిఆర్ ఆదుకుంటున్నారని స్థానిక ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కొనియాడారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం లో ఆయన స్థానిక ప్రజాప్రతినిధులతో కల్సి పలు అధికారిక కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా బొంరస్ పేట మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణి కార్యక్రమంలో పాల్గొని అర్హులకు ఆయన చెక్కులు పంపిణి చేశాడు. అనంతరం కార్యక్రమానికి హాజరైన ప్రజల నుద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో పేద ప్రజలు తమ
ఆడబిడ్డల పెళ్లిళ్లు చేయాలంటే అప్పు చేసే వారని కానీ నేడు తెరాస ప్రభుత్వం ఏర్పడిన తరువాత పేద ప్రజలను ఆదుకునేందుకై సీఎం కెసిఆర్ గతంలో ఏ ప్రభుత్వం చేపట్టిని విధంగా కల్యాణ
లక్ష్మి మరియు షాదీ ముబారక్ పథకాలు ప్రవేశ పెట్టి ఒక లక్ష నూట పదహారు రూపాయలు వారి ఆడబిడ్డల పెళ్లిళ్ల కు ఇచ్చి సొంత అన్నలా…మేన మామలా వారిని ఆడుకుంటున్నాడని
కొనియాడారు.కరోనా వల్ల అర్హుల కు చెక్కులు అందించడం లో కొంత ఆలస్యం జరిగిందని ఆయన అన్నారు. శాశ్వాత భూ వివాదాల పరిస్కారానికే నూతన రెవిన్యూ చట్టాన్ని సీఎం కెసిఆర్ ప్రవేశ పెట్టాడని ఎమ్మెల్యే తెలిపారు.