YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆరోగ్యం దేశీయం

వైరస్ తీవ్రత తక్కువగా ఉంది కానీ.. ప్రమాదం పూర్తిగా తొలిగిపోలేదు - సీసీఎంబీడైరెక్టర్ వెల్లడి

వైరస్ తీవ్రత తక్కువగా ఉంది కానీ.. ప్రమాదం పూర్తిగా తొలిగిపోలేదు - సీసీఎంబీడైరెక్టర్ వెల్లడి

హైదరాబాద్ నగర గాలిలో వైరస్ తీవ్రత ఎలా ఉందన్న విషయాన్ని చెప్పేసిన తాజా పరిశోధన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.హైదరాబాద్ మహానగరంలో కరోనా పేషెంట్లకు చికిత్స అందిస్తున్న ఆసుపత్రుల వద్ద కరోనా జాడలు ఏ తీరులో ఉన్నాయన్న విషయాన్ని నగరానికి చెందిన సీసీఎంబీ తాజాగా వెల్లడించారు.గతంతో పోలిస్తే.. ఇప్పుడు కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టిన విషయం తెలిసిందే. కేసుల నమోదును చూస్తే.. ఈ విషయం ఇట్టే అర్థమయ్యేలా చేస్తుంది. ఇదిలా ఉంటే.. హైదరాబాద్ మహానగరంలో కరోనా పేషెంట్లకు చికిత్స అందిస్తున్న ఆసుపత్రుల వద్ద కరోనా జాడలు ఏ తీరులో ఉన్నాయన్న విషయాన్ని నగరానికి చెందిన సీసీఎంబీ తాజాగా వెల్లడించారు. హైదరాబాద్ నగర గాలిలో వైరస్ తీవ్రత ఎలా ఉందన్న విషయాన్ని చెప్పేసిన తాజా పరిశోధన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.హైదరాబాద్ కేంద్రంగా ఎయిరోసోల్ వైరల్ ట్రాన్స్ మిషన్ పై జరిగిన పరిశోధనలో తేలిందేమంటే.. వైరస్ బాధితులు ఎక్కువగా ఉన్న చోట వైరస్ గాలిలో వ్యాపిస్తున్నట్లుగా తేల్చారు. సంబంధిత రోగి నుంచి కేవలం రెండు నుంచి మూడు మీటర్ల లోపే వ్యాప్తి ఉన్నట్లుగా గుర్తించారు. వెంటిలేషన్ లేకుండా చాలావరకు క్లోజ్డ్ డోర్ లలో వైరస్ గాలిలో తిరుగుతున్నట్లుగా తేల్చారు. గాలి.. వెలుతురు ధారాళంగా ఉన్న చోట వీటి ప్రభావం తక్కువగా ఉన్నట్లుగా తేల్చారు.రోగులు ఉన్న గదిలో 7నుంచి 10అడుగుల ఎత్తులో వైరస్ వ్యాపించే వీలుందని తేల్చారు. నలువైపులా ద్వారాలు తెరిచి వెంటిలేషన్ ఎక్కువగా ఉన్న చోట వైరస్ జాడలు పెద్దగా కనిపించలేదన్నారు. ఇతర దేశాల్లో వ్యక్తమవుతున్నంత ఆందోళన మన దగ్గర చెందాల్సిన అవసరం లేదంటున్నారు. ఎయిరో సోల్ సర్వే ఇంకా కొనసాగుతుందన్న విషయాన్ని సీసీఎంబీ డైరెక్టర్ వెల్లడించారు. తాజాగా నిర్వహించిన రీసెర్చ్ చెప్పిన దాని ప్రకారం.. తీవ్రత తక్కువగా ఉంది కానీ.. ప్రమాదం పూర్తిగా తొలిగిపోయిందని చెప్పలేం. అందుకే.. మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పక తప్పదు.

Related Posts