YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మోడీది విశ్వాసఘతకం

మోడీది విశ్వాసఘతకం

ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాలుగేళ్ల కిందట నవంబరు 8న పెద్ద నోట్లు రద్దు చేసి ప్రజల విశ్వాసఘాతుకానికి పాల్పడ్డారని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌ ఆరోపించారు. అనంతపురంలోని జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయంలో మాట్లాడుతూ నోట్ల రద్దుతో నక్సలిజం, ఉగ్రవాదం, నల్లధనం అంతమొందిస్తామని ప్రగల్బాలు పలికి ప్రజలను మోసం చేశారని విమర్శించారు. అదాని, అంబాని, శేఖర్‌రెడ్డిలకు మేలు చేశారని కేంద్రపాలకులపై దుమ్మెత్తి పోశారు. చప్పట్లు, ఈలలతో కరోనాను అరికట్టలేరన్నారు. ప్రధానమంత్రిని అనుసరిస్తున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కూడా విశ్వాసఘాతుకానికి పాల్పపడుతున్నారని ధ్వజమెత్తారు. కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలు, రాష్ట్రంలో మోటార్లకు కరెంటు మీటర్లు అమర్చడానికి వ్యతిరేకంగా ఈనెల 10న అనంతపురంలో కాంగ్రెస్‌పార్టీ భారీ ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహిస్తున్నట్లు వివరించారు.

Related Posts