YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

లా కమిషన్ పరిధిలోకి బీసీసీఐ

లా కమిషన్ పరిధిలోకి బీసీసీఐ

లా కమిషన్ ఆఫ్ ఇండియా బీసీసీఐకి పెద్ద షాకే ఇచ్చింది. క్రికెట్ బోర్డును ఓ జవాబుదారీ ప్రభుత్వ సంస్థగా గుర్తించాలని, సమాచార హక్కు చట్టం కిందికి తీసుకురావాలని లా కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. బీసీసీఐని రాజ్యాంగంలోని ఆర్టికల్ 12 కిందికి తీసుకురావాలని, దీనివల్ల సుప్రీంకోర్టులాంటి వాటికి క్రికెట్ బోర్డు జవాబుదారీగా ఉంటుందని లా కమిషన్ చెప్పింది. జస్టిస్ బీఎస్ చౌహాన్ నేతృత్వంలోని లా కమిషన్ ఈ సిఫారసులు చేసింది. ఓ రాష్ట్రానికి ఉన్న అధికారాలను బీసీసీఐ అనుభవిస్తున్నది. ఇది అందులోని భాగస్వాముల ప్రాథమిక హక్కులపై ప్రభావం చూపుతుంది అని లా కమిషన్ కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు సూచించింది. ఒకవేళ లా కమిషన్ సిఫారసును కేంద్రం ఆమోదిస్తే గనక.. ఇక నుంచి బీసీసీఐ తీసుకునే నిర్ణయాలపై కోర్టుల్లో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను దాఖలు చేసుకోవచ్చు. అంటే టీమ్ ఎంపిక, రాష్ట్రాలు, జోన్ల విషయంలో ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా వాటిని కోర్టుల్లో లేవనెత్తవచ్చు. బీసీసీఐ కుదుర్చుకునే ఒప్పందాలను కూడా కోర్టుల్లో సవాలు చేసే వీలుంటుంది. దేశంలో క్రికెట్ మొత్తాన్ని తమ చేతుల్లో పెట్టుకొని బీసీసీఐ అక్రమాలకు పాల్పడుతున్నదని లా కమిషన్ అభిప్రాయపడిది. ఇక ఆర్టీఐ చట్టం పరిధిలోకి బీసీసీఐని కచ్చితంగా తీసుకురావాలని కూడా కమిషన్ సూచించడం గమనార్హం. బీసీసీఐని ఓ నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్‌గా చూస్తున్నట్లు ప్రభుత్వం లోక్‌సభలో ప్రకటించింది. దీంతో ఆటోమెటిగ్గా బీసీసీఐ కూడా ఆర్టీఐ చట్టం కిందికి వస్తుంది అని కమిషన్ స్పష్టంచేసింది.

Related Posts