YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

నష్టాలతో మార్కెట్లు

నష్టాలతో మార్కెట్లు

స్టాక్‌మార్కెట్ జోరుకు నేటితో బ్రేకులుపడ్డాయి. వరుసగా 9 రోజులపాటు లాభాల బాటలో నడిచిన స్టాక్‌మార్కెట్లు బుధవారం  నష్టాలను చవిచూశాయి. మంగళవారం (ఏప్రిల్ 17) 34,395 వద్ద ముగిసిన సెన్సెక్స్... ఈ ఉదయం వంద పాయింట్లకు పైగా లాభంతో ప్రారంభమైంది. చివరలో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో 63.38 పాయింట్ల నష్టంతో 34,331.68పాయింట్ల వద్ద ముగిసింది. మరోవైపు నిఫ్టీ కూడా నిన్నటి రోజు(10,549)తో 22.50 పాయింట్లు నష్టపోయి 10,526.20 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.65.62గా ఉంది.గెయిల్‌, విప్రో, ఐటీసీ, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ కంపెనీల షేర్లు లాభపడ్డాయి.టెక్‌ మహీంద్రా, యాక్సిస్‌ బ్యాంకు, హెచ్‌పీసీఎల్‌, టైటాన్‌ కంపెనీ, లుపిన్‌, తదితర కంపెనీల షేర్లు నష్టాలను చవిచూశాయి. 

Related Posts