YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఇది సర్కార్ హత్యే

ఇది సర్కార్ హత్యే

నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటనపై మైలవరంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నిరసన ర్యాలీ నిర్వహించారు. అబ్దుల్ సలాం, నూర్జహాన్ దంపతులు పిల్లలతో సహా రైలుకింద పడి ఆత్మహత్య చేసుకోవడం విచారకరమని అయన అన్నారు.

అబ్దుల్ సలాం కుటుంబం వేధింపులు తట్టుకోలేక సామూహిక ఆత్మహత్యలకు పాల్పడేలా చేసిన ఘటన ఏపీలో వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనం. ఇది ఆత్మహత్య కాదు సర్కారు హత్య. బాధ్యులపై కఠినచర్యలు తీసుకొని ఘటనపై  సిబిఐ విచారణ జరిపించాలని అయన డిమాండ్ చేసారు. గతంలో స్థానిక శాసనసభ్యుడు వసంత కృష్ణ ప్రసాద్ ఇదే మైలవరం సెంటర్ లో ముస్లింలు దళితులపై తన అనుచరులతో దాడి చేయించారు. సలాం కుటుంబానికి అండగా ప్రజాందోళనలు చేస్తామని అయన హెచ్చరించారు.

Related Posts