YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

సత్యనారాయణపురంలో ఎమ్మెల్యే మల్లాది పర్యటన

సత్యనారాయణపురంలో ఎమ్మెల్యే మల్లాది పర్యటన

సత్యనారాయణపురం లోని ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో ప్రజల్లో నాడు... ప్రజల కోసం నేడు కార్యక్రమం జరిగింది. అయన డివిజన్లో గడపగడపకు వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో నవంబర్ ఒకటో తేదీన నూతనగా 600 పెన్షన్లు అందించాం. డివిజన్లో రూ.400 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టాం. డ్రైనేజీ, వీధి దీపాలు,రోడ్లు త్వరితగతిన పూర్తి చేస్తాం. సీఎం జగన్ కు ప్రజాదరణ చూసి చంద్రబాబు,అచ్చం నాయుడు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు.
టీడీపీ నేత అచ్చెన్నాయుడు పత్రిక ప్రకటనకు పరిమితమయ్యాడు. రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత సీఎం జగన్ కె దక్కింది. ముస్లిం మైనార్టీలకు సీఎం జగన్ పెద్దపీట వేశారని అన్నారు.
కుల,మతాలకు అతీతంగా మా ప్రభుత్వం పని చేస్తుంది. తెలుగుదేశం పార్టీ డ్రామా ఆర్టిస్ట్  పార్టీగా మారింది. వైఎస్ఆర్సిపి ప్రభుత్వంపై విమర్శించే నైతిక హక్కు టీడీపీకి లేదు. రాష్ట్ర అభివృద్ధిపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారని అయన అన్నారు.

Related Posts