YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

సుప్రీంలో అర్ణబ్‌కు ఊరట.. బెయిల్‌ మంజూరు

సుప్రీంలో అర్ణబ్‌కు ఊరట.. బెయిల్‌ మంజూరు

రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నబ్ గోస్వామితోపాటు నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటూ జైలులో ఉన్నవారికి సుప్రీంకోర్టు బుధవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మహారాష్ట్ర హైకోర్టు.. అర్నబ్ గోస్వామికి బెయిల్ నిరాకరించడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రియంచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అర్నబ్ గోస్వామికి సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అంతేగాక, మహారాష్ట్ర సర్కారు, హైకోర్టులపై కీలక వ్యాఖ్యలు చేసింది. భావ ప్రకటనా స్వేచ్ఛకు, వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగిస్తే సుప్రీంకోర్టు ఉన్నదనే విషయాన్ని మర్చిపోవద్దని స్పష్టం చేసింది.

ఇంటీరియర్ డిజైనర్ ఆత్మహత్య కేసులో అర్నబ్ గోస్వామిని ముంబై పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన గత కొద్ది రోజులుగా పోలీసుల కస్టడీలోనే ఉన్నారు.

Related Posts