దుబ్బాక ఎమ్మెల్యేగా ఎన్నికయిన రఘు నందన్ రావు బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం సాధించిన వెంటనే అయన తిరుమలకు వచ్చారు. రఘునందన్ రావు మాట్లాడుతూ నాటి నరేంద్రుడి స్పూర్తినే నేడు నరేంద్ర మోదీ కోనసాగిస్తున్నారు. నరేంద్ర మోదీ అడుగు జాడల్లో యువత దేశం కోసం, ధర్మం కోసం పని చేయాలని కోరుతున్నా. దుబ్బాకా నియోజకవర్గం ప్రజలకు మేలు జరగాలని స్వామి వారిని ప్రార్ధించాను. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల కంటే దుబ్బాకా నియోజకవర్గంను అగ్రగామిగా నిలవాలని స్వామి వారిని మనస్సు పూర్తిగా కోరానని అన్నారు. గురువులు ఏవరైనా సరే తన శిఘ్యలు తనకుంటే గొప్ప వారుగా కావాలనే కోరుకుంటారు. నా గురువుకు ఉన్న మంచి లక్షణాలు నాకు వస్తాయని, గొప్ప వారుగా ఎదిగే అవకాశం స్వామి వారు కల్పిస్తారని భావిస్తున్నా. నా గెలుపు దుబ్బాక ప్రజల యొక్క విజయంగా భావిస్తున్నా. పేద, బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతిగా, పేదల గొంతుకుగా శాసన సభ వేదికగా వినిపిస్తా. దుబ్బాక ప్రజల ఆశల నేరవేర్చడంలో నా తుది శ్వాస వరకూ పోరాడుతానని అయన అన్నారు.