కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన రైతు వ్యతిరేక బిల్లులు నిరసిస్తూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు రైతులతో కలిసి భారీ ఎత్తున ట్రాక్టర్ల ర్యాలీ చేపట్టారు. మొదటగా మధిర నుంచి భట్టి విక్రమార్క 700 ట్రాక్టర్లతో ర్యాలీగా బయలుదేరారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున రైతులు స్వచ్ఛందంగా పాల్గొనడం విశేషం. ఇదిలా ఉండగా.. ఈ ర్యాలీలో కాంగ్రెస్ కార్యకర్తలు, శ్రేణులు భారీగా పాల్గొన్నాయి