YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

80 శాతం మంది కోటీశ్వరులే

80 శాతం మంది కోటీశ్వరులే

పాట్నా, నవంబర్ 12, 
బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన వారిలో సుమారు మూడింట రెండొంతుల మందిపై క్రిమినల్‌ కేసులున్నట్లు అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రాటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) వెల్లడించింది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలుండగా.. ఎమ్మెల్యేలుగా ఎన్నికైన 241 మంది సమర్పించిన అఫిడ్‌విట్‌లను ఏడీఆర్‌ విశ్లేషించింది. ఎన్నికైన 243 మంది ఎమ్మెల్యేల్లో 194 మంది (81 శాతం) కోటీశ్వరులున్నట్టు తేలింది. వీరి సగటు ఆస్తి రూ.4.32 కోట్లుగా వివరించింది. 2015 ఎన్నికల్లో 162 మంది కోటీశ్వరులు ఎన్నికయ్యారు.పార్టీల పరంగా కోటీశ్వరులు అత్యధికంగా బీజేపీలో 89 శాతం మంది, జేడీయూలో 88 శాతం, ఆర్జేడీలో 87 శాతం, కాంగ్రెస్ 74 శాతం ఉన్నారు. కాంగ్రెస్ నుంచి విజయం సాధించిన 19 మంది ఒక్కొక్కరి ఆస్తులు కోటికిపైగా ఉన్నట్టు అఫిడ్‌విట్‌లో తెలియజేశారు. రెండోసారి ఎన్నికైన ఎమ్మెల్యేల సగటు ఆస్తి 2015లో రూ.3.15 కోట్లు ఉండగా.. ఈ సారి ఇది రూ.5.26 కోట్లుగా ఉంది.అలాగే 68 శాతం (163 మంది) మందిపై క్రిమినల్‌ కేసులున్నాయి. వీరిలో 123 మందిపై హత్య, అపహరణ (కిడ్నాపింగ్‌), మహిళలపై నేరాలు వంటి తీవ్రమైన క్రిమినల్‌ కేసులున్నాయి. గత ఎన్నికల్లో విజయం సాధించిన 142 మంది (58 శాతం)పై క్రిమినల్ కేసులున్నట్టు ఏడీఆర్ పేర్కొంది. తాజా ఎన్నికల్లో గెలిచిన 31 మంది తమపై హత్య కేసులున్నట్టు, ఎనిమిది మంది మహిళలపై నేరాలకు పాల్పడినట్టు కేసులు ఎదుర్కొంటున్నామని తెలిపారు.పార్టీల పరంగా చూస్తే ఆర్జేడీ ఎమ్మెల్యేల్లో 54 మంది (73 శాతం), బీజేపీ 47 మంది (64 శాతం), జేడీయూ 20 మంది (47 శాతం), కాంగ్రెస్ 16 మంది (84 శాతం), సీపీఐ(ఎంఎల్‌)(ఎల్‌)లో 10 మంది (100 శాతం), ఎంఐఎం ఐదుగురి (100 శాతం)పై క్రిమినల్‌ కేసులున్నట్లు ఏడీఆర్‌ పేర్కొంది. ఇక విద్యార్హతల విషయానికి వస్తే 82 మంది 5 నుంచి ఇంటర్ వరకు చదువుకున్నట్టు తెలియజేయగా.. గ్రాడ్యుయేషన్‌, ఆపైన విద్యార్హత కలిగినవారు 149 మంది. తొమ్మిది మంది అక్షరాస్యులు కాగా.. ఇంకొకరు డిప్లొమా పూర్తి చేశారు.25 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్నవారు 115 మంది.. 51-80 ఏళ్ల మధ్య వయస్కులు 126 మంది ఎన్నికయ్యారు. మహిళ విషయానికి వస్తే కేవలం 11 శాతం మంది మాత్రమే విజయం సాధించారు. గత ఎన్నికల్లో 28 మంది మహిళా ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించారు.

Related Posts