హైదరాబాద్ నవంబరు 12
కుత్బుల్లాపూర్ దత్తాత్రేయ నగర్ లో బస్తి దవాఖాన ను వైద్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ పాల్గోన్నారు. ఈటెల మాట్లాడుతూ బస్తి దవాఖాన లో అన్ని రకాల పరీక్షలకు సంబంధించిన నమూనాలను సేకరించి అందరికి మెరుగైన వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. బస్తి దవాఖాన లో మందుల కొరత ఉండబోదని..దవాఖాన నిత్యం తెరిచే ఉంటుందని తెలిపారు. ఇప్పటికే ఉన్న దవాఖాన లకు అదనంగా మరో 90 బస్తి దవాఖాన లను ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వైద్యశాఖ మంత్రి తెలిపారు.