YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఆత్మనిర్భర భారత్ 3.0

ఆత్మనిర్భర భారత్ 3.0

న్యూఢిల్లీ, నవంబర్ 12
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ఉపాధి కల్పనను పెంచాలనే లక్ష్యంతో కొత్త స్కీమ్‌‌ను తీసుకువచ్చింది. దీని పేరు ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గర్ యోజన. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఆత్మనిర్భర్ 3.0లో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ స్కీమ్‌ను ప్రకటించారు.ఆత్మ నిర్భర్ భారత్ రోజ్‌గర్ యోజన స్కీమ్ ద్వారా దేశంలో ఉపాధి కల్పన పెరుగుతుందని నిర్మలా సీతారామన్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈపీఎఫ్‌వో‌లో రిజిస్టర్ అయిన ప్రతి సంస్థకు ఈ స్కీమ్ వర్తిస్తుంది. కంపెనీలు కొత్తగా ఉద్యోగులను నియమించుకున్నా (2021 జూన్ 30 వరకు) లేదంటే మార్చి 1 నుంచి సెప్టెంబర్ 30 మధ్యలో ఉపాధి కోల్పోయిన వారు ఈ పథకం ద్వారా బెనిఫిట్ పొందొచ్చు.ఈ స్కీమ్‌లో భాగంగా 1000కి లోపు ఉద్యోగులు ఉన్న కంపెనీలు కొత్తగా ఉద్యోగులను చేర్చుకుంటే అప్పుడు వారి పీఎఫ్ కంట్రిబ్యూషన్‌ను, కంపెనీ పీఎఫ్ కంట్రిబ్యూషన్‌ను మొత్తంగా 24 శాతం కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ స్థిరంగా, బ‌లంగా కోలుకుంటోంద‌న్నారు. మూడ‌వ త్రైమాసికంలో వృద్ధి బ‌లంగా ఉంటుంద‌ని ఆమె ఆశాభావం వ్య‌క్తం చేశారు. అక్టోబ‌ర్‌లో పీఎంఐ 58.9గా ఉంద‌న్నారు. దేశంలో కోవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 10 లక్ష‌ల నుంచి 4.9 ల‌క్ష‌ల‌కు చేరుకున్న‌ద‌న్నారు. క‌రోనా మ‌ర‌ణాల రేటు 1.47 శాతానికి ప‌డిపోయింద‌న్నారు. క్ర‌మంగా జీఎస్టీ వ‌సూళ్లు పెరుగుతున్నాయ‌ని, అక్టోబ‌ర్‌లో జీఎస్టీ వ‌సూళ్లు ల‌క్ష కోట్లు దాటిన‌ట్లు చెప్పారు.  సెప్టెంబ‌ర్ ఒక‌టి నుంచి రేష‌న్ కార్డుల‌కు పోర్ట‌బులిటీ క‌ల్పిస్తున్న‌ట్లు మంత్రి సీతారామ‌న్ చెప్పారు.  ఇంట‌ర్ స్టేట్ పోర్ట‌బులిటీ వ‌ల్ల సుమారు 68.6 కోట్ల మంది రేష‌న్ కార్డుదారుల‌కు ల‌బ్ధి చేకూర‌నున్న‌ది. 28 రాష్ట్రాల్లో ఎఫ్‌పీఎస్ సౌల‌భ్యం అమ‌లులో ఉన్న‌ట్లు చెప్పారు.  రేష‌న్ కార్డు పోర్ట‌బులిటీ ద్వారా 1.5 కోట్ల లావాదేవీలు జ‌రుగుతున్న‌ట్లు మంత్రి వెల్ల‌డించారు. 28 రాష్ట్రాల్లో వ‌న్ నేష‌న్‌, వ‌న్ రేష‌న్ కార్డు విధానం అమ‌లులో ఉంద‌న్నారు.  వ‌ల‌స కూలీల డేటా కోసం కేంద్ర కార్మిక శాఖ‌, ఆర్థిక శాఖ‌తో క‌లిసి ప‌నిచేస్తున్న‌ద‌ని, ఈ అంశంపై ఇత‌ర మంత్రిత్వ‌శాఖ‌లు కూడా అన్ని రాష్ట్రాల‌తో క‌లిసి ప‌నిచేస్తున్నాయ‌ని,  వ‌ల‌స కూలీల కోసం ప్ర‌త్యేక పోర్ట‌ల్‌ను త‌యారు చేయ‌నున్న‌ట్లు మంత్రి సీతారామ‌న్ వెల్ల‌డించారు. నాబార్డ్ ద్వారా రైతుల‌కు 25వేల కోట్లు పంపిణీ చేసిన‌ట్లు మంత్రి తెలిపారు. 2.5 కోట్ల రైతుల‌కు కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా క్రెడిట్ బూస్ట్ క‌ల్పించామ‌ని, రైతుల‌కు సుమారు 1.4 ల‌క్ష కోట్లు పంపిణీ చేశామ‌న్నారు.  ఎన్‌బీఎఫ్‌సీ-హెచ్ఎఫ్‌సీల‌కు స్పెష‌ల్ లిక్విడిటీ స్కీమ్ కింద 7227 కోట్లు మంజూరీ చేశామ‌న్నారు.  అదేసమయంలో 1000కి పైన ఉద్యోగులు ఉన్న కంపెనీలు కొత్త వారికి నియమించుకుంటే అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగి కంట్రిబ్యూషన్‌ను చెల్లిస్తుంది. ఇక్కడ ఉద్యోగి వేతనం రూ.15,000లోపు ఉంటేనే ఇది వర్తిస్తుంది.ఈ కొత్త స్కీమ్ 2020 అక్టోబర్ 1 నుంచే అమలులోకి వస్తుందని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వచ్చే రెండేళ్ల కాలం పాటు ఈ స్కీమ్ అమలులో ఉంటుంది. ఇకపోతే 11 రాష్ట్రాలు వడ్డీ రహిత రుణాల కింద రూ.3,621 కోట్ల నిధులు పొందాలయని ఆమె తెలిపారు. అలాగే పన్ను చెల్లింపుదారులకు 1.32 లక్షల కోట్ల రిఫండ్స్ ఇచ్చామని పేర్కొన్నారు.అలాగే ఎమర్జెన్సీ క్రెడిట్ లిక్విడిటీ గ్యారంటీ స్కీమ్ కింద 61 లక్షల మంది రుణ గ్రహీతలకు రూ.2.05 లక్షల కోట్లు మంజూరు చేశామని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇంకా 2.5 కోట్ల మంది రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు అందించామని పేర్కొన్నారు. ప్రధాన్ మంత్రి మత్స్య సంపద యోజన ద్వారా రాష్ట్రాలకు రూ.1,700 కోట్లు విడుదల చేశామని తెలిపారు 

Related Posts