YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

దివాళి తర్వాత నితీష్ ప్రమాణస్వీకారం

దివాళి తర్వాత నితీష్ ప్రమాణస్వీకారం

పాట్నా, నవంబర్ 12 
బిహార్ అసెంబ్లీ ఎన్నికలలో అధికార డెమొక్రాటిక్ అలయన్స్ (ఎన్డీఏ) కి  ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేంత మెజారిటీ లభించింది. దాంతో తదుపరి ప్రభుత్వం ఏర్పాటుపై అందరి దృష్టి ఉన్నది. గతంలో ప్రధాని మోదీ చెప్పినట్లుగానే జేడీయూ అధ్యక్షుడు నితీష్ కుమార్ ఈ నెల 16 న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నితీష్ కుమార్ ఏడోసారి బిహార్ ముఖ్యమంత్రి కానున్నారు. భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం గురువారం సాయంత్రానికల్లా బిహార్ చేరుకుని ప్రభుత్వం ఏర్పాటుపై నితీష్‌ కుమార్‌తో చర్చలు జరుపనున్నట్లు సమాచారంనితీష్‌ కుమార్ ప్రస్తుతం బిహార్‌లో ఎక్కువ కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా రికార్డులో ఉన్నారు. బిహార్‌లో ముఖ్యమంత్రిగా పదవిలో ఉన్న రికార్డు 17 సంవత్సరాల 52 రోజులు శ్రీ కృష్ణ సింగ్ పేరిట ఉన్నది. నితీష్ కుమార్ ఇప్పటివరకు 14 సంవత్సరాలు 82 రోజులు ఈ పదవిలో ఉన్నారు. ఏడోసారి ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో అందరి కళ్లూ నితీష్‌ కుమార్‌పైనే ఉన్నాయి. నితీష్ కుమార్ మొదటిసారి ముఖ్యమంత్రిగా 2000 లో ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, మెజారిటీకి అవసరమైన ఎమ్మెల్యేల మద్దతు లేకపోవడం వల్ల రాజీనామా చేయాల్సి వచ్చింది. 2005 లో ఎన్డీఏకు సంపూర్ణ మెజారిటీ లభించడంతో నితీష్ కుమార్ తిరిగి ముఖ్యమంత్రి అయ్యారు. లోక్‌సభ ఎన్నికల్లో జేడీయూ యొక్క పేలవమైన పనితీరును దృష్టిలో ఉంచుకుని.. 2014 లో నైతిక ప్రాతిపదికన ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్నారు. అయితే, ఏడాది తర్వాత తిరిగి అధికారంలోకి వచ్చారు. 2015 లో నితీష్ కుమార్ యొక్క జేడీయూ, లాలూ ప్రసాద్ యాదవ్ యొక్క ఆర్జేడీ.. అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిగా ఏర్పడి పోటీ చేశారు. మెజార్టీ స్థానాలు గెలిచి మరోసారి ముఖ్యమంత్రి పీఠంపై నితీష్‌ కుమార్‌ కూర్చున్నారు. అయితే, మనీలాండరింగ్ కేసులో అప్పటి ఉప ముఖ్యమంత్రి తేజశ్వి యాదవ్ పేరు రావడంతో ఆయన 2017 లో రాజీనామా చేయాల్సి వచ్చింది. మరుసటి రోజు బీజేపీ మద్దతుతో నితీష్ కుమార్ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.ఈసారి బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బలమైన పోరాటం జరిగింది. నితీష్ కుమార్ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) 243 సీట్లలో పోటీ చేసి 125 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ సాధించింది. ఆర్జేడీ, కాంగ్రెస్‌ కలిసిన మహా కూటమికి 110 సీట్లు వచ్చాయి. ఎన్డీఏలో బీజేపీకి 74 సీట్లు, జేడీయూ 43 సీట్లు వచ్చాయి. బిహార్‌ తదుపరి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అని బుధవారం నాడు ప్రధాని మోదీ స్పష్టం చేయడంతో నితీష్‌ కుమార్‌ ముఖ్యమంత్రి అవుతారా? లేదా? అనే విషయంపై సందిగ్ధం వీడిపోయింది. 

Related Posts