YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

సీఎంపై విశ్వేశ్వరరెడ్డి...పంచ్ లు

సీఎంపై విశ్వేశ్వరరెడ్డి...పంచ్ లు

హైద్రాబాద్, నవంబర్ 15, సీఎం కేసీఆర్‌పై మరోసారి సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. కేసీఆర్ అండ్ ఫ్యామిలీకి ముస్లీం మహిళలు దీపావళి శుభాకాంక్షలు చెబుతున్న వీడియోను పోస్టు చేస్తూ సెటైర్లు వేశారు. ఇటీవల భాగ్యనగరంలో భారీ వర్షాలు పడిన విషయం తెలిసిందే. వానలకు వరదలు ముంచెత్తి అనేక కాలనీలు నీట మునిగేలా చేశాయి. అయితే హైదరాబాద్ ఉస్మాన్ నగర్‌లో గత రెండు నెలలుగా వాన నీరు అలాగే నిలిచి ఉంది. అక్కడ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉస్మాన్ నగర్ కాలనీలో ప్రజలు పడుతున్న ఇబ్బందులపై తాజాగా మాజీ ఎంపీవిశ్వేశ్వరరెడ్డి ట్వీట్ చేశారు.‘ఇక్కడ సమస్యను పరిష్కరించడానికి రెండు గంటలు సమయం పడుతుంది.దాని కోసం స్లూయిస్ గేట్ తెరవాలి. కానీ కెసిఆర్, కెటిఆర్ ప్రభుత్వం ఇది కోరుకోవడం లేదు. వారు భూ కబ్జాదారులను రక్షించాలనుకుంటున్నారు.’ అంటూ ఉస్మాన్ నగర్ కాలనీలో నీటిలో మునిగిన ఫోటోను షేర్ చేశారు. ఆ తర్వాత అదే నీటిలో అక్కడి ముస్లీం మహిళలు కొవ్వుత్తుల వెలుగులో నీటిలో నిలబడి కేసీఆర్, కేటీఆర్, హిమాన్షుకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వీడియోను కూడా కొండా తన ట్విట్టర్‌లో షేర్ చేశారు. ‘కొందరికి సంబరాలు.. మరికొందరికి మాత్రం కష్టాలు’ అంటూ మరో పోస్టు పెట్టడు కొండా. దీంతో ఇప్పుడు మాజీ ఎంపీ చేసిన ఈ ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related Posts