YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

గ్రేటర్ ఎన్నికలపై విచారణ

గ్రేటర్ ఎన్నికలపై విచారణ

హైద్రాబాద్, నవంబర్ 16 
జీహెచ్ఎంసీ ఎన్నికలపై హైకోర్టులో పిటిషన్ ధాఖలు చేశారు. దాఖలైన పిల్ పై హైకోర్టు  విచారణ చేపట్టింది. రెగ్యులర్ రొటేషన్ చేసేంత వరకు గ్రేటర్ ఎన్నికలు నిర్వహించొద్దని పిల్ లో పేర్కొన్నారు. బీజేపీ మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చందర్ పీల్ దాఖలు చేశాడు. పాత రీజర్వేషన్ పద్ధతి లోనే ఎన్నికలు నిర్వహిస్తున్నారని .. రీజర్వేషన్ల ను రొటేషన్ చేసి ఎన్నికలు నిర్వహించాలని పిటీషనర్ పిల్ లో పేర్కొన్నారు. దీంతో జీహెచ్ఎంసీ ఎన్నికలపై ధాఖలైన పిటీషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది.రీజర్వేషన్ రొటేషన్ పద్దతి లేకుండా ఎన్నికలు నిర్వహించడం చట్ట వీరుద్దమని పిటిషనర్ తరపు న్యాయవాది రచనా రెడ్డి కోర్టుకు వెల్లడించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీహెచ్ఎంసీ  యాక్ట్ సెక్షన్ 52  రీజర్వేషన్ పాలసీ కి విరుద్ధంగా ఉందని రచనా రెడ్డి కోర్టుకు తెలిపారు. త్వరలో జీహెచ్ఎంసీ షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉందని అప్పటి వరకు స్టే ఇవ్వాలని రచనా రెడ్డి న్యాయస్థానాన్ని కోరారు. ఈ పిటిషన్ ను చీఫ్ జస్టీస్ విచారిస్తారని తెలిపారు న్యాయవాది అభిషేక్ రెడ్డి. ఈ పిటీషన్ ను చీఫ్ జస్టిస్ బెంచ్ కు న్యాయమూర్తి అభిషేక్ రెడ్డి బదిలీ చేశారు. రేపు పిటీషన్ ను చీఫ్ జస్టిస్ బెంచ్ విచారించనున్నారు.

Related Posts