YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కారు పోలిన గుర్తులను ఎవరికీ కేటాయించొద్దు:ఈసికి టీఆర్‌ఎస్‌ విజ్ఞప్తి

కారు పోలిన గుర్తులను ఎవరికీ కేటాయించొద్దు:ఈసికి టీఆర్‌ఎస్‌ విజ్ఞప్తి

హైదరాబాద్‌ నవంబర్ 16 
 కారు గుర్తును పోలిన గుర్తులను ఎవరికీ కేటాయించొద్దని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు టీఆర్‌ఎస్‌ పార్టీ విజ్ఞప్తి చేసింది. తమ పార్టీ ఎన్నికల చిహ్నాన్ని పోలిన గుర్తుల వల్ల తాము నష్టపోతున్నామని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌ కుమార్‌ ఈసీకి ఫిర్యాదుచేశారు. ఇవాళ పార్టీ నేతలు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఆయన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారథిని కలిశారు. కొన్ని గుర్తులపై అభ్యంతరం వ్యక్తంచేశారు. జరగబోయే గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో వాటిని తొలగించాలని విజ్ఞప్తిచేశారు. ఇటీవల దుబ్బాక ఉపఎన్నికల్లో కారు గుర్తును పోలిన రోటీ మేకర్‌ గుర్తును స్వతంత్ర అభ్యర్థికి కేటాయించారు. దీంతో ఎన్నికల్లో ఆ అభ్యర్థికి 3500లకుపైగా ఓట్లు పోలయ్యాయి.

Related Posts