YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

విజయ్‌ వల్లభ్‌ సురేశ్వర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ

విజయ్‌ వల్లభ్‌ సురేశ్వర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ

జైపూర్‌ నవంబర్ 16
రాజస్థాన్‌ పాళిలో జైనా ఆచార్యుడు విజయ్‌ వల్లభ్‌ సురేశ్వర్‌ విగ్రహాన్ని సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుజరాత్‌ భూమి ఇద్దరు వల్లబ్‌లను ఇచ్చిందని నిత్యానంద్‌ సురేశ్వర్‌ చెప్పేవారన్నారు. ఒకరు రాజకీయ రంగంలో సర్దార్‌ వల్లాభాయ్‌ పటేల్‌, ఆధ్యాతిక రంగంలో జైనా ఆచార్యుడు విజయ్‌ వల్లబ్‌ దేశం ఐక్యత, సోదరభావం కోసం ఇద్దరు తమ జీవితాలను అంకితం చేశారని కొనియాడారు. సర్ధార్‌ వల్లాభాయ్‌ పటేల్‌ విగ్రహం(స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ)తో పాటు స్టాచ్యూ ఆఫ్‌ పీస్‌ విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం రావడం తన అదృష్టమన్నారు. రాజస్థాన్‌ రాష్ట్రం పాళీలోని జెట్‌పురాలోని విజయ్‌ వల్లభా సాధన కేంద్రంలో విగ్రహాన్ని ఆయన ఏర్పాటు చేశారు. 151 అంగుళాల పొడవు ఉన్న విగ్రహాన్ని.. అష్టధాతువుల (ఎనిమిది లోహాలు)తో తయారు చేయారు. విజయ్ వల్లభ సురేశ్వర్‌ జీ మహారాజ్ (1870-1954) మహావీరుడి సందేశాన్ని వ్యాప్తి చేసేందుకు జీవితాంతం కృషి చేశారు. కవితలు, వ్యాసాలు, భక్తి శ్లోకాలతో ప్రజల సంక్షేమం, విద్యావ్యాప్తి, సామాజిక చైతన్యం కోసం పాటుపడ్డారు. అలాగే స్వాతంతోద్యమం, స్వదేశీ ఉద్యమానికి సైతం మద్దతు ఇచ్చారు. 

Related Posts