హైద్రాబాద్, నవంబర్ 17,
ఒక్కోసారి అంతే. దెబ్బ తగిలితే అబ్బా అనాల్సిందే. అధికార పార్టీ అయినా సరే.. తగ్గేదేం లేదు. ఎందుకంటే దెబ్బ ఎవరికైనా దెబ్బే కదా. అందుకే.. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ దెబ్బకి భయపడింది. దుబ్బాకలో హుండేలు దెబ్బ తగలడంతో.. చాలా జాగ్రత్తగా మూవ్ అవుతోంది. హైదరాబాద్ లో ఎలక్షన్ ఉండడంతో.. వరాలు కురిపిస్తోంది. మొన్న వానలతో వరదలొస్తే.. ఈ కురిపిస్తోన్న వానతో.. వరాలొస్తున్నయ్ జనాలకి.సిటీ పాలిటిక్స్ తో పాటు.. సిటీ బిజినెస్ మొత్తం మినిస్టర్ కేటీఆర్ చేతిలోనే ఉంది. అందుకే వరాలు కురిపించే పని కూడా మినిస్టర్ కేటీఆరే చూసుకుంటున్నారు. పైగా కుమారుడ్ని హైలైట్ చేసే ప్రాసెస్ కూడా పనిలో పనిగా అయిపోతుంది కదా. అందుకే.. మొన్న 3 వేల జీతం పెంచుతున్నట్లు.. మినిస్టర్ కేటీఆర్ అనౌన్స్ చేశారు. పాతిక వేల మంది మున్సిపల్ కార్మికులు.. వాళ్ల ఫ్యామిలీలు.. వాళ్ల రిలేషన్లు ఓ దారిలోకి వచ్చినట్లే ఈ దెబ్బతో.ఇక ప్రతి ఇంటికీ మేలు కలిగించే ప్లాన్ కూడా ఇంకోటి చేశారు మినిస్టర్ కేటీఆర్. అదే ఆస్తిపన్ను డిస్కౌంట్. ఆస్తిపన్ను కడితే.. సగానికి సగం డిస్కౌంట్ ఇస్తున్నారు. అంటే.. పదిహేను వేలు ఆస్తిపన్ను కట్టేదుంటే.. ఏడున్నర వేలు కడితే సరిపోతుంది. నేరుగా ఒక ఇంటికి ఏడున్నర వేలు బెన్ ఫిట్. అంటే.. హైదరాబాద్ లో ఓటు ఉండి.. ఇల్లున్న వాళ్లకే ఈ బెన్ ఫిట్ కదా మరి. మొన్న వరద సాయం అందని వారిపై కూడా స్పెషల్ ఫోకస్ పెట్టింది టీఆర్ఎస్ సర్కార్. ఇప్పుడు అప్లై చేసుకుంటే.. ఇప్పుడే ఇవ్వడం లేదా.. ఇస్తాం అనే కన్ఫమేషన్ ఇచ్చి.. ఎన్నికల తర్వాత మనీ ఇవ్వడం ఇలా చేస్తారు. సో.. వరద సాయం వందల ఇళ్లకి మేలు కలిగిస్తుంది. అప్లై చేసిన ప్రతి ఇంటికీ తక్కువలో తక్కువ పది వేలు కదా. ఇలా ఏదో ఒక రకంగా.. హైదరాబాద్ జనాలకి మేలు కలిగించే ప్లాన్ లో ఉంది టీఆర్ఎస్ సర్కార్. అంతా దుబ్బాక దెబ్బ ఎఫెక్టే అంటూ జనాలు ఫుల్లు డిస్కషన్లు చేస్తున్నారు