రంగంలోకి 17 మంది మంత్రులు 85 మంది ఎమ్మెల్యేలు, 9 మందిలోకసభ సభ్యులు 5 గురు రాజ్యసభ సభ్యులు,
గ్రేటర్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీఆర్ ఎస్ వ్యూహాలు రచిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టీఆర్ఎస్ లీడర్లందరినీ గ్రేటర్ ఎన్నికల్లో మోహరించాలని డిసైడ్ అయింది. సీఎం కేసీఆర్ మినహా 17 మంది మంత్రులు, 85 మంది ఎమ్మెల్యేలు, 9 మంది లోక్సభ సభ్యులు, ఐదుగురు రాజ్యసభ సభ్యులు, 32 మంది ఎమ్మెల్సీలకు ఎన్నికల బాధ్యతలు అప్పగించినట్లు తెలిసింది. వీరంతా జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూలు విడుదలైన మరుక్షణం నుంచే ఎన్నికల ప్రచారంలోకి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు.ఎన్నికల కోసం గ్రేటర్లోని నియోజకవర్గానికి ఓ మంత్రిని, డివిజన్ కు ఓ ఎమ్మెల్యేను నియమించినట్లు టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. ఎవరు ఏ నియోజకవర్గం, ఏ డివిజన్ లో ఎన్నికల బాధ్యతలు చూడాలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. వారంతా తమకు అప్పగించిన నియోజకవర్గం, డివిజన్ నేతలతో మీటింగ్లు పెట్టుకుంటున్నారు. లోకల్ ఎమ్మెల్యే కో ఆర్డినేషన్ తో స్థానిక పరిస్థితులను ఆరా తీస్తున్నారు. బీజేపీ బలం ఏ మేరకు ఉందని, ఆ బలాన్ని ఎదుర్కొనేందుకు ఏం చేయాలని అడిగి తెలుసుకుంటున్నారు.భవిష్యత్ అవసరాల మేరకు మంత్రులు, ఎమ్మెల్యేలకు డివిజన్ల బాధ్యతలను తగ్గించడమో, పెంచడమో చేయనున్నట్టు తెలిసింది.. సిటీలో 24 నియోజకవర్గాలు ఉన్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు,ఎంపీలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు , గ్రేటర్ చుట్టున్న మేయర్లు , కార్పొరేషన్ చైర్మన్లు అందరూ జీహెచ్ ఎంసీ ఎన్నికలు ముగిసే వరకు హైదరాబాద్ నుంచి ఎటు వెళ్లొద్దని టీఆర్ఎస్ పెద్దలు ఆదేశించినట్టు తెలిసింది.
ఎల్బీనగర్ - జగదీశ్, సబిత, ఎర్రబెల్లి -
ఉప్పల్ సత్యవతి, జగదీశ్,
మల్కాజ్గిరి - ఈటల రాజేందర్, కొప్పుల, మల్లారెడ్డి,
కుత్బుల్లాపూర్ ప్రశాంత్ రెడ్డి,
పటాన్ చెరు - హరీశ్ రావు
,ఖైరతాబాద్ ఇంద్రకరణ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి
జూబ్లీహిల్స్ గంగుల కమలాకర్,
కూకట్ పల్లి పువ్వాడ అజయ్
సనత్ నగర్ - తలసాని శ్రీనివాస్ యాదవ్,
ముషీరాబాద్ =-శ్రీనివాస్ గౌడ్,
రాజేంద్రనగర్ - మహమూద్ అలీ