YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

గ్రేటర్ గైడ్ లైన్స్..

గ్రేటర్ గైడ్ లైన్స్..

హైద్రాబాద్, నవంబర్ 18, 
రాష్ట్రంలో కరోనా వైరస్ ఇంకా వ్యాప్తి చెందుతున్న వేళ గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిబంధనల గురించి రాష్ట్ర ఎన్నికల సంఘం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. ఎస్‌ఈసీ నిబంధనల మేరకు ప్రతి ఒక్కరు ఫేస్ మాస్క్ తప్పకుండా పెట్టుకోవాలి. కేంద్ర హోం శాఖ ఇచ్చిన నిబంధనల ప్రకారం భౌతికదూరం పాటించాలని.. అందుకు వీలుగా ఎన్నికల నిర్వహణకు విశాలమైన గదులను ఉపయోగించుకోవాలని పేర్కొన్నారు. ఎన్నికల కార్యకలాపాల్లో ఉన్న అందరి వద్ద ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరిగా ఉండాలని ఎస్ఈసీ సూచించింది. ఎన్నికల ప్రచారం సమయంలో కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే ఎన్నికల పరిశీలకులు కేసులు పెట్టనున్నారు.
మార్గదర్శకాలు ఇవే..
* ఎన్నికల సిబ్బందిలో ఎవరికైనా కరోనా లక్షణాలు కనబడితే వారికి బదులుగా ఉపయోగించుకునేందుకు రిటర్నింగ్ అధికారులు, కమిషనర్ సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలి.
* నామినేషన్ సమయంలో అభ్యర్థితో పాటు ఇద్దరికి మాత్రమే అనుమతి ఉండనుంది. కాన్వాయ్ ఉన్న సందర్భాల్లో వాహనాల సంఖ్య రెండుకు మాత్రమే పరిమితం.
* ప్రచారానికి వాడే కాన్వాయ్‌లో రెండు వాహనాల మధ్య కనీసం 100 మీటర్ల దూరం పాటించాలి.
* ఇంటింటి ప్రచారం విషయంలో భద్రతా సిబ్బంది కాకుండా ఐదుగురు కలిసి మాత్రమే చేసుకోవచ్చు.
* రెండు పార్టీలు లేదా అభ్యర్థుల రోడ్ షోలకు మధ్య కనీసం అరగంట గ్యాప్ ఉండాలి.
* కరోనా నిబంధనలకు లోబడి ఎన్నికల ప్రచారాలు లేదా సభలు నిర్వహించాలి.
* దివ్యాంగులు, 80 ఏళ్లు పైబడిన వారు, గుర్తించిన అత్యవసర సేవల్లో ఉన్న వారు పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయం వాడుకోవచ్చు.
* ఎన్నికలు జరిగే ముందు పోలింగ్ కేంద్రాన్ని తప్పకుండా శానిటైజ్‌ చేయాలి.
* ఒక కౌంటింగ్ హాల్‌లో 10 కౌంటింగ్ టేబుళ్లకు మించి ఉండకూడదు. కౌంటింగ్ ముందు బ్యాలెట్ బాక్సులను శానిటైజ్ చేయాలి.
* కౌంటింగ్‌కు ముందు, తర్వాత కౌంటింగ్ సెంటర్లను డిస్ఇన్ఫెక్ట్ చేయాలి. అవసరమైతే పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్‌ ప్రత్యేక హాల్స్‌లో చేపట్టాలి.

Related Posts