YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

నిమ్మగడ్డకు రఘరామ లేఖ

నిమ్మగడ్డకు రఘరామ లేఖ

న్యూఢిల్లీ, నవంబర్ 18
ఏపీ ఎన్నికల సంఘానికి నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను వెంటనే నిర్వహించాలని కోరారు. ఆలస్యం లేకుండా ప్రకటన విడుదల చేయాలని కోరారు. కరోనా ప్రభావం తగ్గిందని.. పొరుగు రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరుగుతున్నాయని.. ఇక్కడా నిర్వహించాలని రఘురామ లేఖలో ప్రస్తావించారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రఘురామ లేఖ రాయడం ఆసక్తికరంగా మారింది. గతంలో కూడా ఆయన అదే డిమాండ్‌ను వినిపిస్తున్నారు. స్కూళ్లు ప్రారంభించిన ప్రభుత్వం కరోనా పేరు చెప్పి ఎన్నికల్ని వాయిదా వేస్తుందని మండిపడ్డారు.ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై వివాదం రేగుతోంది. జగన్ సర్కార్-ఎస్ఈసీ నిమ్మగడ్డ మధ్య వార్ నడుస్తోంది. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు జరపాలని ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవడం.. కౌంటర్‌గా సీఎస్ నీలం సాహ్నీ లేఖ రాయడంతో ఈ వివాదం మరింత ముదిరింది. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ బుధవారం స్థానిక సంస్థల ఎన్నికలపై అన్ని జిల్లాల యంత్రాంగాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.ఈ క్రమంలో సీఎస్ నీలం సాహ్నీ నిమ్మగడ్డకు మంగళవారం రాత్రి లేఖ రాశారు. రాష్ట్రంలో కరోనా ఇంకా అదుపులోకి రాలేదని.. పోలీసులు, జిల్లా యంత్రాంగం కరోనా వ్యప్తి అదుపు చేసే విధుల్లో ఉన్నారని లేఖలో ప్రస్తావించారు. గ్రామీణ ప్రాంతాల్లో యాక్టివ్ కేసులు ఇంకా ఉన్నాయి అన్నారు. తాజాగా సాహ్నీ రాసిన లేఖకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.. ఘాటుగా ఓ మెసేజ్ పంపారు. ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తిని ఎలా ప్రశ్నిస్తారని నిమ్మగడ్డ ప్రశ్నించారు. సీఎస్ రాసిన లేఖ రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందన్నారు.

Related Posts