హైదరాబాద్ నవంబర్ 19
ఈ సారి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 10 చోట్ల ఎంఐఎంను ఓడిస్తామంటూ.. రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలోనే 5 చోట్ల ఎంఐఎంను ఓడించినట్టు తెలిపారు. గోల్కొండపై కాషాయాలు, కషాయాలు ఉండవని అన్నారు. గ్రేటర్ పీఠంపై మహిళ కూర్చోవడం ఖాయమన్నారు.
తెలంగాణ గత ఆరేళ్లలో కేంద్రానికి రూ.2.72 లక్షల కోట్లు ఇచ్చిందని, కేంద్రం మాత్రం తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. అరాచక హైదరాబాద్ కావాలా? అభివృద్ధి హైదరాబాద్ కావాలా? అంటూ ప్రశ్నించారు. గ్రేటర్ ఎన్నికల్లో ఒంటరిగానే 150 సీట్లలో పోటీ చేయనున్నట్టు తెలిపారు. మేయర్ పీఠం తమకే దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.