సైబరాబాద్ కమిమీషనరెట్ రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధి హసన్ నగర్ లో పోలీసులు గురువారం తెల్లవారుజామున కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. శంషాబాద్ జోన్ పరిధిలోని 300 మంది పోలీసులతో తనిఖీలు, సరైన ధ్రువ పత్రాలు లేని 50 మోటారు సైకిల్స్ తోపాటు 30 ఆటోలను సీజ్ చేసారు. ఇరవై మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. అనుమానితులలో ఆరుమంది రౌడీ షీటర్లు వున్నారు. ఇందిరానగర్, బాబానగర్, మహమూద్ నగర్, హసన్ నగర్ కాలనీల్లో పోలీసుల సోదాలు జరిగాయి. శంషాబాద్ జోన్ డిసిపి పద్మజ ఆధ్వర్యంలో శంషాబాద్, రాజేంద్రనగర్ ఎసిపి లు, 12 మంది సిఐలు, 27 మంది ఎసై లతో కలసి 200 మంది సిబ్బంది తో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్డెన్ అండ్ సెర్చ్ కు స్థానికుల నుంచి మంచి సహకారం లభించిందని ఇలాంటి కార్యక్రమాలతో ప్రశాంతంగా ఉండవచ్చని ప్రజలు భావిస్తున్నారని డీసీపీ తెలిపారు.