YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

నగదు కోరతపై ఏటిఎం, బ్యాంక్ల వద్ద 21న కాంగ్రెస్ నిరసన ఏపీసీసీ ఛీఫ్ రఘువీరారెడ్డి

నగదు కోరతపై  ఏటిఎం, బ్యాంక్ల వద్ద 21న  కాంగ్రెస్ నిరసన ఏపీసీసీ ఛీఫ్ రఘువీరారెడ్డి

దేశ వ్యాప్తంగా  బ్యాంకులల్లోను, ఏటిఎంల వద్ద తీవ్రమైన నగదు కోరత ఉందని... ఏపిలో నగదు కోరతపై ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఈ నెల 21 రాష్ట్ర వ్యాప్త నిరసనకు  పిలుపునిచ్చిందని  ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ ఎన్.రఘువీరారెడ్డి తెలిపారు. ఈ నెల 21న రాష్ట్ర వ్యాప్తంగా  అన్ని బ్యాంకులు, ఏటిఎంల వద్ద నిరసన తెలపాలని కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపిలో నగదు కోరత తీవ్రంగా ఉందని, ఏటిఎంలల్లో డబ్బులు లేక ప్రజలు  పడుతున్న ఇబ్బందులు  సీఎం చంద్రబాబుకు కనిసించడం లేదా అని ప్రశ్నించారు. నగదు కోరతతో ప్రజలు  అవస్థలు పడుతుంటే ప్రభుత్వ పరంగా తీసుకున్న చర్యలు ఏమిటి అని డిమాండ్ చేశారు. పెద్దనోట్లు రద్దును స్వాగతించిన సీఎం చంద్రబాబు పరిష్కార కమిటీ  అధ్యక్షులుగా ఉన్న విషయం మర్చిపోయారా అని ప్రశ్నించారు. ప్రజాసమస్యలను పరిష్కారించేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నించాలని  రఘువీరారెడ్డి సూచించారు. 

Related Posts