మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ నెల 23 వ తేదీన మత్స్య కారులతో కలసి కాళేశ్వరం ప్రాజెక్టు ను సందర్శించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా దాదాపు లక్ష మంది మత్స్య కారులకు లబ్ది చేకూరుతుందని అధికారుల అంచనా వేస్తున్నారు. ఈ నేపధ్యంలో మంత్రి దాదాపు 400 మంది మత్స్యకారుల తో కలసి కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిధిలోని మెడిగడ్డ, కన్నెపల్లి, ధర్మారం తదితర ప్రాజెక్ట్ లను సందర్శిస్తారు. మంత్రి నేతృత్వంలో పర్యటనలో పశుసంవర్ధక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, మత్స్య శాఖ కమిషనర్ సువర్ణ, డైరీ ఎండీ నిర్మల, గొర్రెల అభివృద్ధి సమాఖ్య ఎండీ లక్ష్మా రెడ్డి తదితర అధికారులు ఉంటారు.