YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

అతి తీవ్ర తుపానుగా నివర్

అతి తీవ్ర తుపానుగా నివర్

విశాఖపట్టణం, నవంబర్ 25 
బంగాళాఖాతంలో ఏర్పడిన నివర్ తుపాను మరింత బలపడి అతి తీవ్ర తుపానుగా మారింది. నివారు తుపాను తమిళనాడులోని కడలూరుకు తూర్పు ఆగ్నేయ దిశగా 310 కిమీ దూరంలో, పుదుచ్చేరికి ఆగ్నేయంగా 320 కిమీ దూరంలో, చెన్నైకి ఆగ్నేయంగా 380 కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. నివర్ ప్రభావంతో తమిళనాడులో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అత్యవసర విభాగాలకు మినహా తమిళనాడులో నేడు సెలవు ప్రకటించారు. 7 జిల్లాల్లో ప్రజా రవాణా నిలిపివేశారు.ఈ అతి తీవ్ర తుపాను కారైక్కాల్, మామల్లపురం (మహాబలిపురం) మధ్య తీరం దాటుతుందని, తీరం దాటే సమయంలో కడలూరు, విల్లుపురం, కల్లకురిచ్చి జిల్లాల్లోనూ, పుదుచ్చేరిలోనూ మూడ్రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. గంటకు 145 కిమీ వేగంతో గాలులు వీచే అవకాశముందని వాతవరణశాఖ అధికారులు తెలిపారు. నివర్ కారణంగా దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోనే కాకుండా తెలంగాణలోనూ భారీ వర్షపాతం నమోదవుతుందని అధికారులు తెలిపారు. నేటి నుంచి 27వ తేదీ వరకు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముంది. తుపాను కారణంగా అధికారులు అప్రమత్తమయ్యారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మోహరించారు. తమిళనాడులో 12, ఏపీలో 7, పుదుచ్చేరిలో 3 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించారు. నివర్ తుపాను ప్రభావంతో తమిళనాడులో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తుండడంతో అదనంగా మరో 8 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచారు. తుపాను ప్రభావిత జిల్లాలకు తరలి వెళ్లిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. తుపాను సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల వివరిస్తున్నారు.

Related Posts