YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

గులాబీపై ఎంఐఎం మాటల తూటాలు

గులాబీపై ఎంఐఎం మాటల తూటాలు

హైద్రాబాద్, నవంబర్ 25
గ్రేటర్ వార్‌లో నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నువ్వా నేనా అన్న చందంగా అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు... విమర్శలు చేసుకుంటున్నారు. వ్యూహ ప్రతివ్యూహాలతో ఎన్నికల ప్రచారంలో ముందుకు పోతున్నారు. తాజాగా గ్రేటర్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే అక్బరుద్దీన్ టిఆర్ఎస్ ఆరేళ్లలో చేసిన అభివృద్ధి ఎక్కడ ఉందని ప్రశ్నించారు. ఒకప్పుడు 4,700 ఎకరాల హుస్సేన్ సాగర్ ఈ రోజు 700 ఎకరాలు కూడా లేదని ఆయన ఆరోపించారు. అంటే అంత స్థలం లో అక్రమ కట్టడాలు నిర్మించడం జరిగిందన్నారు. ఈ అక్రమ కట్టడాలు కూల్చేస్తా మంటున్నారు. కానీ ఇంత వరకు అధికారులు ఆ చర్యలు చేపట్టనేలేదన్నారు. అక్రమకట్టడాలలో భాగంగా హుస్సేన్‍సాగర్ కట్టపై ఉన్న పీవీ, ఎన్టీఆర్ సమాధులను కూడా కూల్చాలన్నారు. గత ఎన్నికల్లో పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని పేదలకు హామీ ఇచ్చారు.కానీ అధికారంలోకి వచ్చి ఆరు సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంతవరకు పేదలకు డబుల్ బెడ్ రూమ్ మాత్రం మంజూరు చేయలేదని విమర్శించారు అక్బరుద్దీన్.అదేవిధంగా మొన్న కురిసిన భారీ వర్షాలకు వరద బాధితులకు పదివేల రూపాయలు సహాయం అందిస్తున్నామని చెప్పి అందులో 5000 అధికారులే కొట్టేశారన్నారు. అసలు వరదల్లో ఇబ్బందులు పడిన వరద బాధితులకు మాత్రం ఈ పదివేల రూపాయలు అందలేదన్నారు. ఇప్పుడు టిఆర్ఎస్ ఈ ఎన్నికల్లో మాయ మాటలు చెబుతున్నారో.. అసెంబ్లీలో మీ తోక ఎలా తొక్కాలో మాకు బాగా తెలుసు అని ఎమ్మెల్యే అక్బరుద్దీన్ అన్నారు. 

Related Posts