హైదరాబాద్ నవంబర్ 27,
కేసీఆర్ ను హిందువుగా సమాజం గుర్తించడం లేదు. ముఖ్యమంత్రి పీఠం కోసమే అయన యాగాలు, పూజలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. హిందువు వర్గం ఏకం కావాల్సిన సమయం వచ్చింది. పేపర్ లో ఫోటోలు వేసుకుని నేను హిందువు అని సీఎం చెప్పుకుంటున్నాడు. మాకు రోజుకో దేవుడు...వారానికి ఒక పండగ ఉంటుంది. ఎంఐఎం నేతలకు ఏంటి బాధ. హిందూ రాజ్య స్థాపన కు బీజేపీ యుద్ధం చెయ్యబోతుంది. కేసీఆర్ చెప్పిన విశ్వనగరం ఏమయ్యిందని అయన ప్రశ్నించారు. రోడ్లు, లైట్స్, డబుల్ బెడ్ రూమ్ ల నిధులు కూడా కేంద్రం ఇచ్చినవే. వరదలు వస్తే ప్రజల వద్దకు రాని ముఖ్యమంత్రి ఎందుకు ? ఓట్లు చీలితే మనం నష్ట పోతాం. మత ఘర్షణలపై పక్కా సమాచారం ఉంటే ఎందుకు అరెస్ట్ లు చెయ్యడం లేదు. డీజీపీ వ్యాఖ్యలు సిగ్గుమాలిన చర్య అని అయన వ్యాఖ్యానించారు. రోహింగ్యాలను తరిమి కొట్టే బాధ్యత బీజేపీ ది. వందశాతం సర్జికల్ స్ట్రైక్ చేసి తీరుతామని అయన అన్నారు.