YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

వాహనాల దొంగ ఆరెస్టు

వాహనాల దొంగ ఆరెస్టు

తిరుపతి నవంబర్ 30 
తిరుచానూరు దామినీడు ఇందిరమ్మ గృహాల వద్ద వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా పారిపోవటానికి   ప్రయత్నించిన తమిళనాడు కు చెందిన రామమూర్తి సురేష్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుండి దొంగతనం చేసిన 22 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పీ మురళీ కృష్ణ వెల్లడించారు. తిరుచానూరు పోలీసులు దామినిడు ఇందిరమ్మ గృహాల వద్ద వాహన తనిఖీ లు చేస్తుండగా పారిపోతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొన్నారు సిఐ సుధాకర్ రెడ్డి బృందం.ఈ సందర్భంగా తిరుచానూరు పోలీస్ స్టేషన్ లో డిఎస్పీ మురళి కృష్ణ మీడియా సమావేశంలో మాట్లాడుతూ తిరుచానూరు పోలీసులు ప్రత్యేక బృందం గా ఏర్పడి వాహన తనిఖీలు నిర్వహించారని అన్నారు. అందులో భాగంగా పట్టుపడ్డ వ్యక్తి తమిళనాడు లోని వేలూరు కు చెందిన రామమూర్తి సురేష్ గా గుర్తించినట్లు పేర్కొన్నారు. అతని వద్ద నుండి 22 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకొని రామమూర్తి సురేష్ అరెస్ట్ చేసినట్లు తెలియజేశారు. మిగిలిన ముద్దయాలని త్వరలో అరెస్ట్ చేస్తామని స్పష్టం చేశారు.ఈ ద్విచక్ర వాహనాల విలువ సుమారు 22 లక్షల రూపాయలు విలువ చేస్తాయని అన్నారు.ఈ విలేకర్ల సమావేశంలో ఎస్ ఐ రామకృష్ణ ఇతర పోలీస్ అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు

Related Posts