YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

కొత్తగా అమల్లోకి 5 నిర్ణయాలు

కొత్తగా అమల్లోకి 5 నిర్ణయాలు

న్యూఢిల్లీ. డిసెంబర్ 1,
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా  నిబంధనలు ఈరోజు నుంచి అమలులోకి వస్తాయి. మనీ ట్రాన్స్‌ఫర్‌కు సంబంధించిన పలు అంశాల్లో మార్పులు రాబోతున్నాయి. ఆర్‌టీజీఎస్ మనీ ట్రాన్స్‌ఫర్ సేవలు ఇకపై 365 రోజులూ అందుబాటులో ఉంటాయి. ఆర్‌టీజీఎస్ ద్వారా కనీసం రూ.2 లక్షలు పంపాల్సి ఉంటుంది.గ్యాస్ సిలిండర్ ధరలో కూడా మార్పులు ఉండొచ్చు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెలా ఒకటో తేదీనా గ్యాస్ సిలిండర్ ధరలను సవరిస్తూ ఉంటాయి. ఈసారి కూడా ఇదే జరుగుతుంది. కొన్నిసార్లు ధరలో ఎలాంటి మర్పు ఉండకపోవచ్చు.. ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే వారికి కూడా బెనిఫిట్ కలుగనుంది. పాలసీ తీసుకున్న 5 ఏళ్ల తర్వాత పాలసీదారులు అవసరం అనుకుంటే ప్రీమియం మొత్తాన్ని 50 శాతం తగ్గించుకోవచ్చు. అంటే సగం ప్రీమియంతోనే పాలసీని కొనసాగించొచ్చు. ఇండియన్ రైల్వేస్ మరిన్ని ట్రైన్స్‌ను పట్టాలెక్కించనుంది. డిసెంబర్ 1 నుంచి పలు ట్రైన్స్‌ను నడుపనుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎం రూల్స్‌ను మార్చేసింది. ఇకపై పీఎన్‌బీ బ్యాంక్ ఏటీఎంకు వెళ్లి డబ్బులు విత్‌డ్రా చేసుకోవాలని భావించే వారు మొబైల్ ఫోన వెంట తీసుకెళ్లాలి. ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. దీన్ని ఎంటర్ చేస్తేనే డబ్బులు తీసుకోగలం. అయితే రూ.10 వేలకు పైన లావాదేవీలకు ఇది వర్తిస్తుంది.

Related Posts