YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏపీలో అశోక్ లేలాండ్ ప్లాంట్

ఏపీలో అశోక్ లేలాండ్ ప్లాంట్

హిందూజా గ్రూపునకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ అశోక్‌ లేలాండ్‌ ఆంధ్రప్రదేశ్‌లో తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఇందుకు దాదాపుగా రూ.200 కోట్లు పెట్టుబడులు అవసరం అవుతాయని ఆ కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వినోద్‌ కె దాసరి తెలిపారు. ఎపిలో ఏర్పాటు చేస్తున్న ప్లాంట్‌లో బస్‌లు మాత్రమే కాకుండా ట్రక్కులు, విద్యుత్‌ వాహనాలను కూడా తయారు చేయనున్నామని తెలిపారు. 2018-19లో మొత్తంగా రూ.1,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు పేర్కొన్నారు. తమ వినూత్న కల్పనల ప్రయాణం కొనసాగుతుందన్నారు. గతంలో తాము ప్రపంచంలోనే తొలి ఇజిఆర్‌ ఆధారిత బిఎస్‌4 వర్షన్‌ వాహనాన్ని అందుబాటులోకి తెచ్చామన్నారు. ఇది పని చేయదని చాలా మంది పేర్కొన్నారన్నారు. కాని తాము గతేడాది ఈ టెక్నలాజీ ఆధారిత లక్ష ట్రక్కులతో పాటు బస్సులను విక్రయించామన్నారు. తమ కంపెనీ వినూత్నకల్పనలు, అభివృద్ధి, కొత్త ఉత్పత్తుల నిర్మాణంపై దృష్టి పెట్టిందన్నారు. ఇందులో లైఫ్‌ టెక్నలాజీ పేటెంట్‌ కలిగిన 41 టన్నుల వాహనం ఉందన్నారు. తమ సామర్థ్యాలను పెంచుకోవడం. విద్యుత్‌ వాహనాల అభివృద్ధికి పెట్టుబడులను కొనసాగిస్తామన్నారు. విద్యుత్‌ వాహనాల కోసం రూ.100 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నామని చెప్పారు. మొత్తంగా సామర్థ్యాన్ని పెంచుకోవడానికి రూ.1,000 కోట్ల పెట్టుబడులు అవసరం అవుతాయన్నారు. గతేడాది తాము ఆవిష్కరించిన ఎడమ చెయ్యి డ్రైవింగ్‌ తేలిక పాటి వాణిజ్య వాహనాలు (ఎల్‌సివి) కొత్త మార్కెట్లకు విస్తరించడానికి దోహదం చేశాయన్నారు. ఎల్‌సివిలో తమ పెట్టుబడులు కొనసాగుతాయన్నారు. గతేడాది రక్షణ రంగ వ్యాపారంలో రూ.800 కోట్ల రెవెన్యూ 

Related Posts