YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

గ్రేటర్ ఎన్నికలు- ఉద్రిక్తత

గ్రేటర్ ఎన్నికలు- ఉద్రిక్తత

హైదరాబాద్, డిసెంబర్ 1
గ్రేటర్ హైదరాబాద్‌లో జరుగుతున్న మున్సిపల్  కార్పొరేషన్ ఎన్నికలు పలుచోట్ల ఉద్రికతలకు దారి తీస్తున్నాయి. పలుపార్టీలకు చెందిన కార్యకర్తలు, నాయకులు ఘర్షణలకు దిగుతున్నారు. జంగంమెట్ డివిజిన్ రెయిన్ బజార్‌లో రిగ్గింగ్ కలకలం రేపింది. ఎంఐఎం కార్యర్తలు దొంగ ఓట్లు వేయడానికి వచ్చారని బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. బీజేపీ నేతల్ని తరిమికొట్టడానికి ఎంఐఎం కార్యర్తలు ప్రయత్నించారు.గతంలో చాంద్రాయణగుట్ట నియోజక వర్గం బీజేపీ నుంచి పోటీ చేసిన షాహేజాదితో పాటు బీజేపీ నాయకులు జంగమేట్ సేంట్ పీటర్ స్కూల్ వద్ద దొంగ ఓట్లు పడుతున్నాయని ఆరోపించడంతో ఎంఐఎం నాయకులు ఘర్షణకు దిగారు. నువ్వు ఏమైనా అభ్యర్థి వా ఇక్కడ ఎలా వస్తావ్ అంటూ ఆమెను, బీజేపీ నాయకులను తరిమివేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు రంగం ప్రవేశం చేసి ఇరువర్గాల్ని చెదరగొట్టారుమరోవైపు ఉప్పల్‌లో 33వ పోలింగ్ బూత్ వద్ద కూడా ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఆధార్ కార్డుతో ఫోటో మార్ఫింగ్ చేసి దొంగ ఓట్లు వేస్తున్నారని టీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. జీడిమెట్ల డివిజన్‌లో కూడా ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీఆర్ఎస్ , బీజేపీ కార్యకర్తల మధ్య గొడవ రాజుకుంది. దీంతో ఇరువర్గాల్ని పోలీసులు చెదరగొట్టారు. జీడిమెట్ల డివిజన్లో కుత్బుల్లాపూర్ గవర్నమెంట్ హై స్కూల్ దగ్గర బిజెపి టిఆర్ఎస్ నాయకులు ఘర్షణకు దిగారు. మరోవైపు గ్రేటర్ ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటలకే ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. కొన్ని చోట్ల గొడవలు మినహా పోలింగ్ మాత్రం ప్రశాంతంగానే సాగుతోంది. మంత్రి కారుపై దాడి జీహెచ్‌ఎంసీ పోలింగ్‌ జరుగుతున్న క్రమంలో కేపీహెచ్‌బీ ఫోరమ్ మాల్ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మాల్ వద్ద టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు డబ్బులు పంచుతున్నారంటూ బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్ కారులో డబ్బులు పంచుతున్నారని ఆరోపిస్తూ ఆయన కారుపై దాడి చేశారు. ఓ టీఆర్ఎస్ కార్యకర్తపై బీజేపీ కార్యకర్తలు దాడి చేసి తీవ్రంగా కొట్టారు. మంత్రి కాన్వాయ్‌ను వెంబడించి కారు అద్దాలు ధ్వంసం చేశారు. పోలీసులు కార్యకర్తలను చెదరగొట్టారు.

Related Posts