YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

తమ్మినేని చంద్రబాబుపై తీవ్రంగా ఫైర్

తమ్మినేని చంద్రబాబుపై తీవ్రంగా ఫైర్

విజయవాడ, డిసెంబర్ 1, 
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రెండో రోజు సమావేశాలు కూడా వాడివేడిగా సాగుతున్నాయి. మంగళవారం జరిగిన సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకుల సవాళ్లు, ప్రతి సవాళ్లతో హీటెక్కాయి. అయితే ఉన్నట్లుండి అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు మధ్య మాటల యుద్ధం నెలకొంది. టిడ్కో ఇళ్లకు సంబంధించిన అంశంపై టీడీపీ ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇదే అంశంపై వైసీపీ ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ మాట్లాడుతుండగా.. చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు అడ్డుతగిలారు.ప్రతిపక్ష సభ్యులపై స్పీకర్ తమ్మినేని సీతారాం అసహనం వ్యక్తం చేశారు. కాస్త హుందా ప్రవర్తించాలంటూ చంద్రబాబుకు హితవు పలికారు. దీంతో తమరు కూడా బాధ్యతగా వ్యవహరించాలంటూ స్పీకర్‌ను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారు. ఈ క్రమంలో స్పీకర్ తమ్మినేని చంద్రబాబుపై తీవ్రంగా ఫైర్ అయ్యారు. బల్లను చరుస్తూ ఆవేశంతో ఊగిపోయారు.మాట్లాడే పద్ధతి నేర్చుకోవాలంటూ చంద్రబాబుపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ ఉడత ఊపులకు, పిల్లి శాపనార్థాలకు భయపబోనని వ్యాఖ్యానించారు. సభాధ్యక్షుడునే బెదిరిస్తారా అంటూ స్పీకర్ తీవ్రం విరుచుకుపడ్డారు. టీడీపీ సభ్యుల ప్రవర్తనపై కూడా స్పీకర్ తమ్మినేని ఫైర్ అయ్యారు. మీ శాపనార్థాలకు భయపడేది లేదంటూ స్పీకర్ తమ్మినేని చంద్రబాబు మీద తీవ్రంగా ఫైరయ్యారు. నీ దగ్గర నీతులు నేర్చుకోవాల్సిన అవసరం లేదంటూ చంద్రబాబును హెచ్చరించారు. స్పీకర్ ఆగ్రహంతో అసెంబ్లీలో ఒక్కసారిగా గందరగోళ పరిస్థితి నెలకొంది.
 

Related Posts