YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

జూన్ చివరి వారంలో ఎల్బీనగర్ కు మెట్రో రైలు

జూన్ చివరి వారంలో ఎల్బీనగర్ కు మెట్రో రైలు

అమీర్ పేట - ఎల్బీనగర్ మధ్య మెట్రో రైలు మార్గం జూన్ చివరి నాటికి పూర్తవుతుంది. జూన్ చివరిలో ఈ మార్గం ప్రారంభించాలా... ఆగష్టులోనా అన్నది ప్రభుత్వం నిర్ణయిస్తుందని హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. గురువారం అయన మీడియాతో మాట్లాడారు. కమ్యూనికేషన్ బేస్డ్ ట్రైన్ కంట్రోల్ సిస్టమ్ వినియోగించడం  దేశంలోనే తొలి సారి . సీబీటీసీ టెక్నాలజీ వినియోగించే కారణంతోనే  కొంత జాప్యం అవుతుందని అయన అన్నారు. హెటెక్ సిటీ వరకు మెట్రో మార్గం కోసం ఆస్థుల సేకరణ పనులు జరుగుతున్నాయి. సెప్టెంబర్ చివరి నాటికి హైటెక్ సిటీ మార్గం పనులు పూర్తవుతాయని అన్నారు. మెట్రో రెండో దశ పనులపై సీఎం మాతో చర్చించారు. ఎయిర్ పోర్టు వరకు మెట్రో పొడిగించాలని సీఎం భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ప్రత్యామ్నాయ ప్రణాళికలు, ఆర్థిక వనరుల సేకరణపై ఆలోచించమని సీఎం చెప్పారని అయన వెల్లడించారు

Related Posts