హైదరాబాద్ డిసెంబర్ 4,
బ్యాలెట్ పేపర్లపై స్వస్తిక్ గుర్తు వుంటేనే లెక్కింపు పరిగణలోకి తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలను కోర్టు కొట్టివేసింది. తదపరి విచారణను సోమవారానికి వాయిదా వేసిన న్యాయస్థానం పూర్తి వివరణకు ఇవ్వాల్సిందిగా ఎస్ఈసీని ఆదేశించింది. ఫలితాలనకు కూడా తుది ఉత్తర్వులకు లోబడి ఇవ్వాలని ఆదేశించింది. బ్యాలెట్పై స్వస్తిక్ గుర్తుతో పాటు మార్కర్ పెన్తో టిక్ చేసినా పరిగణలోకి తీసుకోవాలంటూ గత రాత్రి అధికారులకు ఎస్ఈసీ సర్క్యూలర్ జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిస బీజేపీ... హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. బీజేపీ పిటిషన్ను ధర్మాసనం విచారించింది.