YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

న్యాయస్థానానికి ధన్యవాదాలు

న్యాయస్థానానికి ధన్యవాదాలు

హైదరాబాద్ డిసెంబర్  4, 
ఓటర్ల విశ్వాసాన్ని నిలపెట్టిన కోర్టుకు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను.  ఎప్పటిలాగానే రాష్ట్ర ప్రభుత్వానికి మరో మొట్టికాయ ,ఇప్పటికైనా కొంచమైనా సిగ్గు తెచ్చుకోండని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు.  ఎన్నిసార్లు కోర్టు మొట్టియాలు వేసిన దున్నపోతుమీద వాన పడ్డట్టుగానే పరిస్థితి వుంది. ఎస్ఈసీ ,రాష్ట్ర ప్రభుత్వం కుమ్మక్కై ప్రజాస్వామ్యానికి  తూట్లు పొడవాలని చేసిన ప్రయత్నాన్ని హైకోర్టు అడ్డుకొని న్యాయ్యవస్థ పై ప్రజలకున్న నమ్మకాన్ని  విశ్వాసాన్ని పెంచిందని అయన వ్యాఖ్యానించారు. జీహెచ్ఎంసీ  ఎన్నికల్లో బీజేపీ సాధించిన మొదటి నైతిక విజయం ఇది. అడ్డదారుల్లో గెలవాలని చూసిన టిఆర్ఎస్ పార్టీ కి ఇది చెంపపెట్టు. ఎలక్షన్ కమిషనర్ వెంటనే రాజీనామా చెయ్యాలి ,లేదా ప్రభుత్వమే బర్తరఫ్ చేయాలి,లేకపోతే ప్రజలే ఈ కెసిఆర్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేస్తారని అయన అన్ఆరు. ప్రజా తీర్పును గౌరవించలేని వ్యక్తి ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక అర్హత లేదు. టిఆర్ఎస్ ,ఈసీ ఎంత అనైతికంగా వ్యవహరించారో హైకోర్టు సాక్షిగా బట్టబయలు అయింది. ప్రతీ గంటకు పోలింగ్ శాతం ప్రకటించిన ఈ.సి, సాయంత్రం 5 నుంచి 6 వరకు జరిగిన పోలింగ్ శాతాన్ని ఎందుకు అప్పటికప్పుడే ప్రకటించలేదు. 5 నుండి 6 గంటల వరకు 12% నుండి 18% శాతం ఎలా పెరిగిందని అయన ప్రశ్నించారు. హైకోర్టు విచారణ జరపాలి కొన్ని పోలింగ్ స్టేషన్ లలో ఉన్నట్టుండి 90% శాతానికి పోలింగ్ పెరిగింది. ఇందులో ఏదో గాంబ్లింగ్ జరిగింది అనే అనుమానం ఉంది , వాటిమీద కూడా విచారణ జరపాలి. దీనికి కెసిఆర్ ఏం సమాధానం చెబుతారు? ఇంత దుర్మార్గంగా ఎప్పుడూ ,ఎక్కడా ఎన్నికలు జరగలేదు. పెన్నుతో టిక్కులు పెట్టిన లెక్కపెట్టుర్రి అని సర్క్యులర్ విడుదల చెయ్యడం చూస్తుంటే అధికారం పోతదేమో అన్న కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఎన్నికుట్రలు చేసిన బీజేపీ వైపే ప్రజలు ఉన్నారని తెరాస ప్రభుత్వం చేస్తున్న కుట్రలే సాక్షాలని సంజయ్ వ్యాఖ్యానించారు.

Related Posts