గ్రేటర్ ఎన్నికలు, ఫలితాల సరళిపై పూర్తి సమాచారం కోసం ఆర్టీఐకి దరఖాస్తు చేశారు కాంగ్రెస్ నేత, ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి డా. శ్రవణ్ దాసోజు. అధికార పార్టీ టీఆర్ఎస్, ఎంఐఎంలు రిగ్గింగ్ కు పాల్పడినట్లు పలు కధనాలు వినిపిస్తున్నాయి. పోలింగ్ చివరి నిమిషం వరకూ 38% పోలింగ్ జరిగినట్లు మొదట సమాచారం వచ్చింది. కానీ చివరి గంట తర్వాత ఎలక్షన్ కమీషన్ మాత్రం పోలింగ్ 50శాతం జరిగిందని ప్రకటించడం కూడా పలు అనుమానాలకు తావిచ్చింది. ఈ నేపధ్యంలో ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి డా. శ్రవణ్ దాసోజు.. సమాచారం హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా గ్రేటర్ ఎన్నికల పూర్తి సమాచారంని కోరారు. ఈ మేరకు ఆయన దరఖాస్తు చేశారు.జిహెచ్ఎంసి ఎన్నికల్లో భాగంగా 150డివిజన్లలోని ప్రతి పోలింగ్ భూత్లో ఓటింగ్ మొదలైన సమయం నుంచి చివరి సమయం వరకూ సిసిటీవీ పుటేజీలను, వెబ్ కాస్టింగ్ రికార్డింగ్ వీడియో డేటా పూర్తి సమాచారం అందజేయాలని కోరారు శ్రవణ్.అదే విధంగా ఎన్నికల్లో భాగంగా 150 డివిజన్ల వారిగా మొత్తం పోలైన ఓట్ల వివరాలతో పాటు మొత్తం బ్యాలెట్ పేపర్ లపై స్వస్తిక్ ఏతర గుర్తు ద్వారా కానీ మారే ఇతర మార్క్ ద్వారా పోలిన మొత్తం ఓట్లు వివరాలు ఇవ్వాలని దరఖాస్తులో పేర్కొన్నారు శ్రవణ్.