YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

బురేవి తుపాన్ బీభత్సం

బురేవి తుపాన్ బీభత్సం

బురేవి తుపాన్ తమిళనాడులో బీభ త్సం సృష్టిస్తోంది.తుపాన్ కారణంగా దక్షిణ తమిళనాడు జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే తుపాన్ ప్రభావంతో తమిళనాడులో 12 మంది మరణించారు. ఇప్పటికి బురేవి తుపాన్ రామనాథన్ జిల్లా తీరానికి సమీపంలోని గల్ఫ్ ఆఫ్ ప్రాంతంలో కేందీకృతం అయినట్టుగా భారత వాతావరణ శాఖ తెలిపింది. గత 30 గంటలుగా అదే ప్రాంతంలో స్థిరంగా కొనసాగుతున్నట్టుగా పేర్కొం ది. మరో 12 గంటల పాటు బురేవి తుపాన్ అదే ప్రాంతంలో స్థిరంగా ఉంటుందని తెలిపింది. ఆ తర్వాత అది బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ఇక, ఇప్పటివకే బురేవి ప్రభావంతో తమిళనాడు, కేరళలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యం గా తమిళనాడులోని రామేశ్వరం జిల్లాతోపాటు, పుదుచ్చేరిలలో భారీ వర్షపాతం నమోదైంది.దీంతో చాలా ప్రాంతాలు నీట మునిగాయి. పలుచోట్ల జనజీవనం పూర్తిగా స్తంభించిపోయిం ది. భారీ వర్షాలతో ప్రముఖ చిదంబరం నటరాజ స్వామి ఆలయం జలదిగ్బం ధంలో ఉంది. పలుచోట్ల పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. నేడు, రేపు కూడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావర శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు బురేవి తుఫాను ప్రభావం ఆంధ్ర ప్రదేశ్పైనా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. దక్షిణ కోస్తా, రాయల సీమ జిల్లాల్లో తుపాన్ ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.  బురేవి తుపాను ప్రభావంతో తీరప్రాంతంలోని లోతట్టు గ్రామాలు నీటమునిగాయి. కాలనీల్లోకి నీరు చేరి జనజీవనం స్తంభించింది.

Related Posts