తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి బీజేపీనే ప్రత్యామ్నాయమని సినీ నటి, మాజీ ఎంపీ విజయశాంతి అన్నారు. కేవలం తన కుటుంబం మాత్రమే బాగుపడాలనే స్వార్థం ఉన్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావును గద్దె దింపేది తామేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విజయశాంతి బీజేపీలో చేరారు. జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్సింగ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకొన్నారు. ఈ సందర్భంగా తన రాజకీయ జీవితం గురించి మాట్లాడుతూ.. 1998లో బీజేపీలో చేరానని,కొందరు తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నారని 2005లో ఆ పార్టీ నుంచి బయటికి వచ్చానని అన్నారు.టీఆర్ఎస్ కంటే ముందు తానే తెలంగాణ ఉద్యమంలో భాగమయ్యానని అన్నారు.కేసీఆర్ కుట్రతోనే టీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారని,అన్నారు.తెలంగాణలో తన కుటుంబం మాత్రమే ఎదగాలనే స్వార్థం కేసీఆర్ దని అన్నారు.